కెనడాలో తొలి తెలుగు మహిళా మంత్రి: హిందువులు, సిక్కుల కోసం చొరవ
టోరంటో: కెనడాలోని అతి పెద్ద ప్రావిన్సు అయిన ఒంటారియోకు మంత్రిగా పని చేస్తున్న తెలుగు యువతి దీపిక దామెర్ల ప్రవాస భారతీయుల అవసరాల పైన ప్రత్యేకంగా దృష్టి సారించారు.
మిస్సిసాగా నగరంలో నివసిస్తున్న హిందువులు, సిక్కులు సహా ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేకంగా శ్మశాన వాటిక, అంత్యక్రియల ప్రాంతాలను కేటాయించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
సికింద్రాబాదులో జన్మించిన దీపిక... ఉత్తర అమెరికాలో మంత్రి పదవి చేపట్టిన తొలి తెలుగు మహిళ కావడం గమనార్హం. దీపిక తండ్రి ఆర్మీలో సేవలు అందించారు. దీపిక డిగ్రీ పూర్తి చేశాక 1991లో కెనెడా వెళ్లారు. రోట్మ్యాన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబియే పూర్తి చేశారు.
తర్వాత అక్కడి రెండు ప్రముఖ బ్యాంకుల్లో పని చేశారు. టీవీ జర్నలిస్ట్గాను పని చేశారు. 2007లో రాజకీయాల్లో చేరారు. లేబర్ పార్టీ తరఫున పోటీ చేసి 2014 ఎన్నికల్లో గెలిచి ఆరోగ్య, దీర్ఘకాల సంరక్షణ సహాయ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు.
దీపిక మాట్లాడుతూ... హిందువులు, సిక్కులు, ఇతర వర్గాలకు స్మశాన వాటికలు ఏర్పాటు చేసే విషయమై అధికారులతో మాట్లాడుతున్నానని చెప్పారు. కెనడాలో భారత్ జనాభా క్రమంగా పెరుగుతోందన్నారు. భారత్ బయట మంత్రి పదవి చేపట్టిన తొలి మహిళను తానే కావొచ్చన్నారు.