Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్ యాగానికి రేపు చంద్రబాబు: అంబానీతో అరగంట భేటీ

హైదరాబాద్: లోక కల్యాణం కోసం మెదక్‌జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ తలపెట్టిన అయుత మహా చండీయాగంలో చివరి రోజైన 27వ తేదీ(ఆదివారం)నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు.

చండీయాగం చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వరుస సెలవులు భారీగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. చివరి రోజున నిర్వహించనున్న పూజల కోసం రెండు వేల కేజీల పసుపు, రెండు వేల కేజీల కుంకుమను సిద్ధం చేశారు. ఈ పసుపును కేసీఆర్ ఇంట్లో పట్టడం విశేషం.

ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో చండీయాగానికి సీఎం చంద్రబాబు హాజరుకావాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రులు సుజనాచౌదరి, అశోక్‌గజపతిరాజు కూడా చండీయాగానికి హాజరవుతారు. వీరితో పాటు ఏపీ కేబినెట్‌లో కొందరు మంత్రులు కూడా యాగానికి రానున్నట్టు తెలుస్తోంది.

Ap CM Chandrababu Naidu will attend final day of kcr chandi yagam

ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ భేటీ అయ్యారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం చంద్రబాబుతో సుమారు అరగంట సేపు వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు. రాష్ట్రంలో 4జీ సేవలు, గ్రామాలకు సాంకేతికత అనుసంధానంపై చర్చించారు. అనంతరం అనిల్ అంబానీ తిరిగి పయనమయ్యారు.

ఐదోరోజు యాగంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఇప్పటికే కేసీఆర్‌తో గవర్నర్ చర్చించారు. దీంతో ఎర్రవల్లిని భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. చంద్రబాబు ఆహ్వానం మేరకు అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం హోదాలో కేసీఆర్ హాజరయ్యారు.

దీంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడింది. ఆయుత చండీయాగానికి హాజరు కావాల్సిందిగా ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లి మరీ కేసీఆర్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చండీయాగానికి హాజరవుతానని హామీ ఇచ్చారు.

రాష్ట్ర విభజన జరిగి రెండు రాష్ట్రాలు ఆవిర్భవించిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాల అభివృద్ధి, అభ్యున్నతి కోసం విభేదాలను పక్కనబెట్టి సఖ్యతగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్‌ తలపెట్టిన అయుత మహా చండీయాగం శనివారంతో నాలుగో రోజుకు చేరుకుంది.

నాలుగో రోజు యాగంలో భాగంగా తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణలు పాల్గొన్నారు. వరుస సెలవులు రావడంతో ఎర్రవల్లిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తుల రద్దీ దృష్టా పోలీసు బందోబస్తును రెట్టింపు చేశారు. రాత్రి 10 గంటల వరకు యాగశాలను సందర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.

108 హోమగుండాలతో 1500 మంది రుత్విక్కులు, 5 రోజులపాటు 10 వేల సప్తశతి పారాయణలను, చండీ నవాక్షరి జపాలను జపిస్తున్నారు. ఆయుత చండీయాగం జరిగే ఎర్రవల్లిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 27 వరకు జరగనున్న ఈ ఆయుత చండీయాగాన్ని శృంగేరి శారదా పీఠం నుంచి ఇక్కడి నుంచి వచ్చిన 6గురు ప్రధాన రుత్విజుల పర్యవేక్షణలో ఈ యాగం జరగుతుంది.

యాగాన్ని తిలకించేందుకు విచ్చేస్తున్న ప్రముఖులు, ఆధ్యాత్మిక వేత్తల రాకతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. యాగశాల వద్ద 4వేల మంది తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు. రోజూ 50వేల మందికి అన్నదానం చేసే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. దాదాపు 3,300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. యాగశాల చుట్టూ 5కిలోమీటర్ల వరకు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+