గ్రేటర్ ఎన్నికలు: బీఫ్‌పై అసదుద్దీన్ సంచలన ప్రకటన

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల నాయకులు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా, మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ బీఫ్‌పై సంచలన ప్రకటన చేశారు. బీఫ్ కావాలంటే తమ పార్టీకి ఓటేయాలని ఆయన సోమవారం ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు పిలుపునిచ్చారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతే హైదరాబాదులో బీఫ్ తినే అవకాశం కోల్పోతామని ఆయన అన్నారు. బిజెపి, శివసేన కూటమి గెలిచినప్పుడు ముంబైలో వారం రోజుల పాటు బీఫ్ అమ్మకాలను నిషేధించారని ఆయన గుర్తు చేశారు. అందుకే బీఫ్ తినేవారు తమ పార్టీకి ఓటేయాలని ఆయన పిలుపునిచ్రారు.

 Asaduddin makes comments on beef

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బిజెపి, టిడిపి కూటమి గెలిస్తే బీఫ్ తినే అవకాశం ఉండదని ఆయన అన్నారు. హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధి తమ పార్టీతోనే సాధ్యమని ఆయన చెప్పారు. ఇప్పటికే ఎన్నో అబివృద్ధి పనులు చేశామని ఆయన చెప్పారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఫ్ ఎగుమతలు 17 శాతానికి పడిపోయాయని ఆయన చెప్పారు.

తమకు ఓటు వేస్తే ముంబైలాగా హైదరాబాద్ కూకుండా అడ్డుకుంటామని ఓవైసి చెప్పారు. మజ్లీస్ పాతబస్తీలో తిరిగి పాగా వేయాలనే ఉద్దేశంతో ఉంది. ఇందులో భాగంగానే అసదుద్దీన్ ఆ ప్రకటన చేశారని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+