చర్చి, మసీదుల్లో ఫోటో పెట్టగలరా..? యాదాద్రిలో కేసీఆర్ ఫోటోపై బండి సంజయ్ ఫైర్
హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్. యాదాద్రి ఆలయంలో తన ఫోటోలు పెట్టుకోవడం ఏంటి అని ప్రశ్నించారు. ఇది మంచి పద్ధతి కాదని .. చర్చి, మసీదుల్లో ఫోటో పెట్టుకునే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. శనివారం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ సరికాదు ..
పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయంలో సీఎం కేసీఆర్ ఫోటో పెట్టుకోవడం సరికాదన్నారు సంజయ్. ఆలయంలో ఫోటోలు పెట్టుకున్న కేసీఆర్ .. చర్చి, మసీదుల్లో కూడా పెట్టుకోగలరా అని ప్రశ్నించారు. ఆలయంలో పార్టీ పోటోలు ప్రదర్శించడం మంచిది కాదన్నారు. ఇప్పటికైనా వైఖరి మార్చుకోవాలని సూచించారు. లేదంటే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొవాల్సి వస్తోందని హితవు పలికారు.

తొలగించి తప్పును సరిదిద్దండి ..
కరీంనగర్ వేదికగా హిందుగాళ్లు, బొందుగాళ్లు అని కామెంట్ చేసిన కేసీఆర్కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. దేవాలయంలో ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. దేవుడిపై, ధర్మం పట్ల కేసీఆర్కు చిత్తశుద్ది ఉంటే యాదాద్రి వెళ్లి అర్చకులతో కలిసి ఫోటోలు తొలగించాలని డిమాండ్ చేశారు. చేసిన తప్పుకు పరిహారంగా పాలాభిషేకం చేయాలని సూచించారు. అప్పుడే కేసీఆర్ను హిందూ సమాజం క్షమిస్తోందని చెప్పారు. లేదంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications