వారికి అడుగడుగునా అవమానాలే.. సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ!!
తెలంగాణ సీఎం కేసీఆర్ ను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిత్యం టార్గెట్ చేస్తూనే ఉన్నారు. గత కొంత కాలంగా అధికార టీఆర్ఎస్ కు, బీజేపీకి మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతుంది. నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్ళతో రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. తాజాగా బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పంచాయతీ కార్యదర్శులపై జరుగుతున్న దాడులను బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు.
Recommended Video

పంచాయతీ కార్యదర్శులలో మనోధైర్యం నింపటం ప్రభుత్వ బాధ్యత
జూనియర్ పంచాయతీ కార్యదర్శులలో మనోధైర్యం నింపడం ప్రభుత్వ బాధ్యత అని అని పేర్కొన్న బండి సంజయ్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ భద్రతకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శులపై ఉన్నతాధికారుల వేధింపులు నిత్య కృత్యంగా మారాయని, ఈ పరిస్థితులు దారుణమని బండి సంజయ్ పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులను ఉద్యోగులుగా క్రమబద్దీకరించి, పే స్కేల్ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని బండి సంజయ్ వెల్లడించారు.
12,765 గ్రామపంచాయతీలలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పే స్కేల్ అమలుచేయాలి
గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర చాలా కీలకమైనదని బండి సంజయ్ పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులు మనోధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు .తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12765 గ్రామపంచాయతీలో పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు పే స్కేల్ అమలుచేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

నిత్య అవమానాలను ఎదుర్కొంటున్న పంచాయతీ కార్యదర్శులు
పారిశుద్ధ్యం, హరితహారం పనులు మొదలుకొని దోమల నివారణ చర్యల వరకూ పది రకాల పనులను వారు ప్రతి రోజూ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇవి మాత్రమే కాకుండా ప్రభుత్వం చేపట్టి అనేక పథకాలను గ్రామాలలో అమలయ్యే విధంగా నిత్యం శ్రమిస్తున్నారని బండి సంజయ్ వెల్లడించారు. అయినప్పటికీ వారికి నిత్య అవమానాలు ఎడురవుతున్నాయన్నారు. ఉన్నతాధికారుల బెదిరింపులు తప్పడం లేదని, కొన్నిచోట్ల పంచాయతీ కార్యదర్శుల భౌతిక దాడులు కూడా జరుగుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు.

జూనియర్ పంచాయతీ సెక్రెటరీ లను క్రమబద్ధీకరించాలి
దీంతో వారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు చూస్తున్నామని పేర్కొన్న బండి సంజయ్ వెంటనే జూనియర్ పంచాయతీ సెక్రెటరీ లను క్రమబద్ధీకరించడానికి, పే స్కేల్ అమలు చేయడానికి చర్యలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తుంది అని ఏపీ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. మరి బండి సంజయ్ రాసిన లేఖపై తెలంగాణా సీఎం కేసీఆర్ ఏ విధంగా స్పందించారో వేచి చూడాల్సిందే.
-
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్!












Click it and Unblock the Notifications