రైతులకు మరో భారీ శుభవార్త.. లక్షకు 50వేలు చెల్లిస్తే సరి!
తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే రైతు సంక్షేమం కోసం రైతు బీమా, రైతు భరోసా పథకాలను అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో భారీ శుభవార్త అందించింది . వ్యవసాయ రంగంలో ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు పురోగతి సాధించాలంటే అందుకు తగిన విధంగా వ్యవసాయ యంత్ర పరికరాలతో రైతులు సాగు చేయాలని భావిస్తోంది.
వ్యవసాయ పరికరాల కొనుగోలుకు సబ్సిడీతో రుణాలు
ఈ క్రమంలోనే నూతన టెక్నాలజీని ఉపయోగించుకుని తయారుచేసిన అనేక పరికరాలకు బ్యాంకుల ద్వారా రుణాలను అందిస్తుంది. సబ్సిడీ కూడా ప్రభుత్వమే ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వం అందించే ఈ సబ్సిడీ విధానం వల్ల రైతులు సగం ఖర్చుతోనే ఆధునిక వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. వ్యవసాయ పరికరాల కొనుగోలు రైతులకు భారం కాకుండా ప్రభుత్వం వారికి 50 శాతం సబ్సిడీతో అందిస్తోంది.

లక్షకు 50 వేలు చెల్లిస్తే సరిపోతుంది
స్థానిక ఏఈఓ ల వద్ద రైతులు అవసరమైన పత్రాలు జిరాక్స్ కాపీలను జత చేసి దరఖాస్తు చేసుకుంటే వారికి కావలసిన ఆధునిక యంత్ర పరికరాలు కొనుగోలు చేసేందుకు సబ్సిడీతో ప్రభుత్వం సాయం అందిస్తుంది. ఉదాహరణకు ఒక రోటవేటర్ కొనుగోలు చేయాలంటే దాని ధర లక్ష రూపాయలు అని అనుకుంటే ఎస్సీ ఎస్టీ మహిళా రైతులు కేవలం 50000 రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
వ్యవసాయ పరికరాల కోసం ఇలా చెయ్యండి
మిగిలిన 50 వేల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అదే ఇతర కేటగిరీల రైతులు అయితే 40 శాతం సబ్సిడీని పొందుతారు అంటే వారికి 40 వేల రూపాయల సబ్సిడీ అందుతుంది. వారు 60 వేల రూపాయలు చెల్లించవలసి ఉంటుంది . ఇక వ్యవసాయ పరికరాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు వ్యవసాయ శాఖాధికారులను సంప్రదించాలి.
ఈ పత్రాలతో దరఖాస్తులు చేసుకుంటే సబ్సిడీపై పనిముట్లు
తమ ఆధార్, పాస్ బుక్, బ్యాంకు వివరాలు, సాయిల్ హెల్త్ కార్డులు, ఫోటోలు జతచేసి క్లస్టర్ ఏఈఓ లేదా మండల వ్యవసాయ అధికారి వద్ద దరఖాస్తులు చేసుకోవాలి. చిన్న సన్నకారు రైతాంగానికి కూడా యంత్ర పరికరాల కొనుగోలుకు సబ్సిడీపై రుణాలు అందిస్తూ తెలంగాణా ప్రభుత్వం రైతన్నకు బాసటగా నిలుస్తుంది.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications