కేసీఆర్ సైలెన్స్ వెనుక బిగ్ ప్లాన్.. కాంగ్రెస్ కు ముందుంది మొసళ్ళ పండుగ!!
తెలంగాణ రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఊహించని విధంగా తెలంగాణ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలు కావడం కెసిఆర్ కు షాక్ అని చెప్పాలి. తెలంగాణలో 40 స్థానాలు గెలుచుకున్న కేసీఆర్ ఎంఐఎం మద్దతుతో పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన శాసన సభ్యులను తమ వైపుకు తిప్పుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు.
బీఆర్ఎస్ పార్టీ ఆర్థికంగా అంత బలంగా ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. కానీ గులాబీ బాస్ కెసిఆర్ ఎందుకు సైలెంట్ అయ్యారు? ఒక మాట కూడా మాట్లాడకుండా ఫామ్ హౌస్ కి ఎందుకు వెళ్లిపోయారు? అంటే ఓటమిని అంగీకరించారని చాలామంది చెబుతున్నారు. అయితే అలాంటిదేమీ లేదు కెసిఆర్ వ్యూహాలు ఎవరికి అర్థం కావు అని చెబుతున్న వారు కూడా లేకపోలేదు.

తమ ఎమ్మెల్యేలను ఎక్కడ ప్రలోభాలకు గురిచేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంటారో అని బి ఆర్ ఎస్ గురించి భయపడి, ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించాలని భావించింది కాంగ్రెస్. వారి ఊహలకు అందకుండా కెసిఆర్ అటువంటి ప్రయత్నాలు ఏవి చేయకుండా సైలెంట్ అయ్యారు. అంతేకాదు తమకు 40 స్థానాలు ఇచ్చిన ఓటర్లను ఉద్దేశించి కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా కేసీఆర్ వెళ్లిపోయారు.
అయితే కెసిఆర్ ఒక ఆరు నెలలపాటు బ్రేక్ తీసుకొని, తర్వాత ఊహించని విధంగా రాజకీయం చేస్తారని బీఆర్ఎస్ శ్రేణులలో ఆసక్తికరచర్చ జరుగుతుంది. తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చి, ఆరునెలల కాలం చూసి, ఆపై వారి వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి, ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తఎమ్మెల్యేలను తమ వైపుకి తిప్పుకొని తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి గులాబీ అధినేత కచ్చితంగా ప్లాన్ చేస్తారని చర్చిస్తున్నారు.
ఐదేళ్లపాటు పూర్తి కాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలించే అవకాశం లేదని, ఆ వ్యూహంతోనే సీఎం కేసీఆర్ ప్రస్తుతానికి సైలెంట్ అయినట్టుగా చర్చ జరుగుతుంది. ఇప్పుడే ఆ పని చేస్తే ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీకి మరింత వ్యతిరేకత వస్తుందన్న ఆలోచనలోనే కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఏం చేసినా సఖ్యత కుదరదని, మళ్లీ అధికారం తమదేనని, అందుకు కేసీఆర్ మళ్ళీ ప్లాన్ చేస్తారని బీఆర్ఎస్ నేతలు బలంగానే నమ్ముతున్నారు.
-
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి..












Click it and Unblock the Notifications