టెన్షన్.. టెన్షన్.. : అసెంబ్లీ వద్ద పోలీసులు-కిషన్ రెడ్డి వాగ్వివాదం
హైదరాబాద్ : విలీనమా..? విమోచనమా..? ఎవరి లెక్క వారిదే, ఎవరి అభిప్రాయాలు వారివే. సెప్టెంబర్ 17 వచ్చిందంటే చాలు.. తెలంగాణ రాజకీయాల్లో దీనిపైనే వాడి వేడి చర్చ. ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీజేపీ నేతలకు మధ్య ఇప్పుడీ అంశం నిప్పు రాజేస్తుంది.
సెప్టెంబర్ 17ను విలీన దినంగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తుండడంతో.. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. ఇదే క్రమంలో బీజేపీ కార్యాలయంలో దీనిపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ వాదనను వినిపించారు బీజేపీ నేతలు.

అనంతరం హైదరాబాద్ అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న జాతీయ జెండాను ఎగిరేసుందుకు బయలుదేరారు నేతలు. అయితే బీజేపీ నేతలందరినీ అసెంబ్లీ గేటు దగ్గరే అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులకు బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. లోపలికి వెళ్లేందుకు బీజేపీ నేతలు పట్టుబట్టడంతో అసెంబ్లీ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లుగా సమాచారం.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications