గోదావరిలో పడవ బోల్తా: తప్పిన పెనుప్రమాదం, బాలుడి గల్లంతు
కరీంనగర్: జిల్లాలోని మహదేవపూర్ మండలం మెట్పల్లి వద్ద నిర్మిస్తున్న అంతరాష్ట్ర గోదావరి వంతెన నిర్మాణం వద్ద ఓ పడవ ఆదివారం సాయంత్రం మునిగింది. ఈ ఘటనలో 12ఏళ్ల బాలుడి గల్లంతయ్యాడు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర నుంచి తెలంగాణ వైపు గోదావరి తీరం దాటేందుకు అవతలి తీరం మహారాష్ట్రలోని సిరొంచ నుంచి 24మంది ప్రయాణికులతో ఓ పడవ బయలుదేరింది.
మెట్పల్లిలోని గోదావరి తీరానికి పడవ చేరుకునే సమయంలో వంతెన నిర్మాణానికి సంబంధించిన ఇనుప తీగ అడ్డుతగలడంతో బోల్తాపడింది. ప్రమాదానికి కారణాల్లో ఇనుప తీగ ఒకటికాగా, పడవలో ప్రయాణికులకు చెందిన నాలుగు ద్విచక్రవాహనాల వల్ల పడవ బరువు పెరగడం మరో కారణంగా తెలుస్తోంది.

ప్రమాదంలో పడవలో ఉన్న 24మంది నీటమునిగారు. వీరిలో కొంతమంది ఈత కొడతూ ఒడ్డుకు చేరుకోగా, మరికొంతమందిని వంతెన నిర్మాణ సిబ్బంది రక్షించారు. కాగా, కాటారం మండలం ఆదివారంపేటకు చెందిన బుర్ర వంశీ(12) గల్లంతైనట్లు గుర్తించారు. అతనితోపాటు తల్లి, సోదరి(నాలుగు నెలలు) వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
పసిపాప పరిస్థితి విషమంగా ఉండటంతో గోదావరిఖని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో, రెస్క్యూటీంతో గాలింపుచర్యలు చేపట్టారు. ఘటనాస్థలిని ఇరు రాష్ట్రాల పోలీసులు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. కేసు నమోదు చేసి ద్వర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications