ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కలిసి చనిపోదామని చెప్పాడు: ప్రేయసికి పురుగుల మందు తాగించి ఉడాయించాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్: కలిసి చనిపోదామని చెప్పి ప్రేయసికి పురుగుల మందు తాగించి, తాను మాత్రం తాగకుండా ఓ యువకుడు ఉడాయించాడు. మన మధ్య అనుమానాలు ఉండకూడదని, అనుమానాలు ఉన్నప్పుడు జీవించకూడదని, ఇద్దరం కలిసి పురుగుల మందు తాగి చనిపోదామనని ఓ యువకుడు తన ప్రేయసికి నచ్చజెప్పాడు.

ఆదిలాబాదు జిల్లా బేల మండలంలోని సదల్‌పూర్ గ్రామానికి చెందిన బాలిక 917), వరరూర్ (కె) గ్రామానికి చెందిన మడావి సంతోష్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఆ బాలికను సంతోష్ అనుమానంతో వేధించసాగాడు.

Boy cheats lover and takes life in Adilabad district

ఈ స్థితిలో సోమవారం మధ్యాహ్నం ఫోన్ చేసి సదల్‌పూర్‌కు వచ్చానని, ప్రభుత్వ పాఠశాల వెనక్కి రావాలని అతను ప్రేయసికి చెప్పాడు. అక్కడకు వచ్చిన బాలికతో అనుమానం ఎందుకు, ఇద్దరం కలిసి చనిపోదామని చెప్పాడు.

అలా చెప్పి ఆమెతో పురుగుల మందు తాగించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స్పృహ తప్పి పడిపోయిన బాలికను ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

English summary
An Youth santhosh made his lover to consume poison and escaped from the scene in Adilabad district of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X