కలిసి చనిపోదామని చెప్పాడు: ప్రేయసికి పురుగుల మందు తాగించి ఉడాయించాడు
ఆదిలాబాద్: కలిసి చనిపోదామని చెప్పి ప్రేయసికి పురుగుల మందు తాగించి, తాను మాత్రం తాగకుండా ఓ యువకుడు ఉడాయించాడు. మన మధ్య అనుమానాలు ఉండకూడదని, అనుమానాలు ఉన్నప్పుడు జీవించకూడదని, ఇద్దరం కలిసి పురుగుల మందు తాగి చనిపోదామనని ఓ యువకుడు తన ప్రేయసికి నచ్చజెప్పాడు.
ఆదిలాబాదు జిల్లా బేల మండలంలోని సదల్పూర్ గ్రామానికి చెందిన బాలిక 917), వరరూర్ (కె) గ్రామానికి చెందిన మడావి సంతోష్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఆ బాలికను సంతోష్ అనుమానంతో వేధించసాగాడు.
ఈ స్థితిలో సోమవారం మధ్యాహ్నం ఫోన్ చేసి సదల్పూర్కు వచ్చానని, ప్రభుత్వ పాఠశాల వెనక్కి రావాలని అతను ప్రేయసికి చెప్పాడు. అక్కడకు వచ్చిన బాలికతో అనుమానం ఎందుకు, ఇద్దరం కలిసి చనిపోదామని చెప్పాడు.
అలా చెప్పి ఆమెతో పురుగుల మందు తాగించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స్పృహ తప్పి పడిపోయిన బాలికను ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.