Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

NH 365బిపై కేంద్రానికి డిమాండ్.. ఉద్యమిస్తామని హెచ్చరిక!

తెలంగాణా రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా జాతీయ రహదారి 365బి విషయంలో తెలంగాణా రాష్ట్రం నుండి కేంద్రానికి డిమాండ్ వినిపిస్తుంది. జాతీయ రహదారి 365 బి ని రాజన్న సిరిసిల్ల జిల్లా మీదుగా కోరుట్ల వరకు విస్తరించాలని, రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు, కరీంనగర్ మాజీ ఎంపి బోయినిపల్లి వినోద్ కుమార్ కోరారు.

బండి సంజయ్ ను టార్గెట్ చేసిన మాజీ ఎంపీ
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం లోని తెలంగాణ భవన్ లో విలేఖరులతో మాట్లాడిన ఆయన కేంద్ర మంత్రి బండి సంజయ్ ను టార్గెట్ చేశారు. మంత్రి బండి సంజయ్ ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు మానుకుని జాతీయ రహదారుల విషయంలో ప్రజల డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని తదనుగుణంగా కేంద్రాన్ని ఒప్పించాలన్నారు.

BRS EX MP vinod kumar Demands to the Center on NH 365B expansion warned bandi sanjay

జాతీయ రహదారులను విస్తరించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరిక
సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, సిరిసిల్ల వేములవాడ పట్టణాల మీదుగా నిర్మిస్తున్న జాతీయ రహదారి '365బీ'ని కోరుట్ల వరకు విస్తరించాలని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా జాతీయ రహదారులను విస్తరించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. సూర్యాపేట-కోరుట్ల వరకు కే ఫోర్దేన్ రోడ్డు నిర్మిస్తే.. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారితో, ఇటు ఆర్మూర్-జగదల్ పూర్ జాతీయ రహదారితో అనుసంధానం ఏర్పడుతుందన్నారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్.

బండి సంజయ్ ఇది చెయ్యాల్సిందే
కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సం జయ్ కుమార్ ఇప్పటికైనా జాతీయ రహ దారుల విస్తరణపై దృష్టి సారించాలని సూచించారు. ఢిల్లీ స్థాయిలో దీనిని ఫాలో అఫ్ చేయాలన్నారు. సిరిసిల్ల మానేరు వంతెనపై రాజమండ్రి తరహాలో రైల్వే బ్రిడ్జి కం రోడ్డు మార్గం నిర్మాణానికి గతంలో మంత్రి కేటీఆర్ తో కలిసి కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరి కి ప్రతిపాదించినట్లు ఆయన గుర్తు చేశారు.

డీపీఆర్ స్థాయిలో ఉన్నప్పుడే అలైన్మెంట్ మార్చాలని సూచన
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో నుంచి ప్రతిపాదించిన జాతీయ రహదారి అలైన్ మెంట్ మార్చి రైల్వేలైన్ తోపాటే నిర్మించాలని వినోద్ కుమార్ కోరారు. ఈ అలైన్మెంట్ కారణంగా సిరిసిల్లలో చిన్న స్థలాల యజమానులు నష్టపోతున్నా రని, అలైన్మెంట్ మార్చి పట్టణానికి దూరంగా వేయాలని కోరారు. డీపీఆర్ స్థాయిలో ఉన్నప్పుడే మార్పులకు సాధ్యమన్నారు.ఇక జాతీయ రహదారుల విస్తరణకు భూయజమానులు సహకరించాలని, భూము లు కోల్పోయే వారికి ప్రభుత్వం పరిహారం అందించాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+