హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫ్యామిలీతో పాటు ప్రణబ్‌ను కలిసిన కెసిఆర్ (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. వేములవాడ నుంచి తిరుగు ప్రయాణంలో కుటుంబ సభ్యులతో కలిసి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లి ప్రణబ్‌ను కలిశారు.

ఇదిలావుంటే, సోమవారంనాడు కేసీఆర్ కుటుంబ సభ్యులు వేములవాడ పుణ్యక్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ నుంచి తిరిగి వస్తూ రాష్ట్రపతిని కలిశారు.

కెసిఆర్ ఐదు రోజుల పాటు ఎర్రవల్లి గ్రామంలోని తన ఫామ్‌హౌస్‌లో ఆయుత చండీయాగం నిర్వహించిన విషయం తెలిసిందే. ఫామ్ హౌస్ నుంచి ఆయన కుటుంబ సభ్యులతో వేములవాడ వెళ్లారు.

పుష్పగుచ్ఛం ఇస్తూ...

పుష్పగుచ్ఛం ఇస్తూ...

వేములవాడ నుంచి తిరిగి వస్తూ సికింద్రాబాదులోని బొల్లారం రాష్ట్రపతి భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు.

రాష్ట్రపతితో కెసిఆర్ ఇలా...

రాష్ట్రపతితో కెసిఆర్ ఇలా...

సికింద్రాబాదులోని రాష్ట్రపతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఇలా కనిపించారు.

రాష్ట్రపతితో కుటుంబ సభ్యులు..

రాష్ట్రపతితో కుటుంబ సభ్యులు..

కెసిఆర్ తన కుటుంబ సభ్యులో కలిసి సికింద్రాబాదులోని బొల్లారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఇలా కనిపించారు.

కెటిఆర్ దంపతులు కూడా...

కెటిఆర్ దంపతులు కూడా...

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో తెలంగాణ ఐటి మంత్రి కెటి రామారావు దంపతులు, ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు ఇలా..

రాష్ట్రపతితో కెటిఆర్, కెసిఆర్...

రాష్ట్రపతితో కెటిఆర్, కెసిఆర్...

సికింద్రాబాదులోని బొల్లారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో తండ్రీకొడుకులు కెసిఆర్, కెటిఆర్ ఇలా..

English summary
K. Chandrashekhar Rao, Chief Minister of Telangana , with his family members called on President Of India Shri Pranab Mukherjee at Rashtrapati Nilayam,, Bolarum, Secunderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X