ఓటుకు నోటులో ఏసీబీకి హైకోర్టు షాక్: మత్తయ్య పిటిషన్పై ఓకే
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తన పైన ఉన్న ఏసీబీ కేసును కొట్టివేయాలని నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య పెట్టుకున్న పిటిషన్ పైన విచారణ జరిపేందుకు హైకోర్టు నిర్ణయించింది. ఇప్పటికే ఛార్జీషీట్ దాఖలు చేసినందున ఎఫ్ఐఆర్ కొట్టివేయాలన్న పిటిషన్ చెల్లదని ప్రకటించాలని ఏసీబీ దాఖలు చేసిన మెమోను కొట్టేసింది.
మత్తయ్య దాఖలు చేసిన పిటిషన్ పైన ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకర రావు బుధవారం నాడు రహస్య విచారణ చేపట్టారు. ఓటుకు నోటు కేసులో ఛార్జీషీట్ దాఖలు చేశామని, అందువల్ల మత్తయ్య పిటిషన్ పైన విచారణ అవసరం లేదని ఏసీబీ తెలిపింది.

ఛార్జీషీట్ దాఖలును కొట్టివేయాలని ఆయన కోర్టును ఆశ్రయించవచ్చునని, అలాకాకున్నా డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని తెలిపింది. ఏసీబీ వాదనతో మత్తయ్య తరఫు న్యాయవాది ఏకీభవించలేదు. చార్జీషీట్ అసంపూర్తిగా ఉందని చెప్పారు. మత్తయ్య తరఫు లాయర్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. ఏసీబీ మెమోను తోసిపుచ్చింది.
ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు కేసు ఐదారు నెలల క్రితం తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో టిడిపి నేత రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, మత్తయ్య, సండ్ర వెంకట వీరయ్య తదితరులు నిందితులుగా ఉన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications