చీటింగ్: ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసలెం మత్తయ్య అరెస్ట్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్యను ఓ చీటింగ్ కేసులో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారుల అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఏకంగా హైదాబాద్ నుంచి నవ్యాంధ్రకు మత్తయ్య వెళ్లిన సంగతి తెలిసిందే.
అక్కడి వెళ్లిన తర్వాత హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు ముందస్తు బెయిల్ పొందిన తర్వాతే ఆయన హైదరాబాద్లో అడుగుపెట్టాడు. అయితే ఓటుకు నోటు కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకున్న మత్తయ్య తాజాగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని తన చేతివాటాన్ని ప్రదర్శించాడు.

చైతన్యపురి సీఐ గురు రాఘవేంద్ర కథనం ప్రకారం, మత్తయ్య 2006వ సంవత్సరంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్న విద్యార్థులకు స్టార్హోటళ్లలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు తీసుకుని మోసం చేయడంతో కొత్తపేటకు చెందిన కిరణ్కుమార్ అనే బాధితుడు సరూర్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఈ ఫిర్యాదు మేరకు మత్తయ్యపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు. మేజిస్ట్రేట్ జారీచేసిన ఆదేశాల మేరకు ఉప్పల్లో ఉంటున్న మత్తయ్యను చైతన్యపురి పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రంగారెడ్డి జిల్లా 11వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చిన ఆ తర్వాత చర్లపల్లి జైలుకు తరలించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications