ఏపీ ఆన్లైన్ సెంటర్లో దర్జాగా యువతి దొంగతనం, వీడియోకు చిక్కింది
హైదరాబాద్: భాగ్యనగరంలోని నేరెడ్మెట్ ఏపీ ఆన్ లైన్ సెంటర్లో ఓ గుర్తు తెలియని మహిళ గురువారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో ముసుగు వేసుకొని వచ్చి వెళ్లింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో అక్కడ ఉన్న డబ్బులు తీసుకు వెళ్లింది.
ఏపీ ఆన్లైన్ సెంటరుకు వచ్చిన సదరు మహిళ స్మార్ట్గా దొంగతనం చేసింది. అయితే ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాకు చిక్కించి. ఓ మహిళ క్యాష్ కౌంటరు వద్దకు వచ్చి డబ్బు తస్కరించి, దాన్ని తన హ్యాండ్ బ్యాగులో పెట్టుకుని వెళ్లిపోయింది.

నగదు తగ్గిందని తెలుసుకున్న సెంటరు యజమాని సీసీటీవీ దృశ్యాలను చూసి, పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు వీడియో ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆమె రూ.3వేలు తీసుకు వెళ్లింది.
కాల్ సెంటర్ పేరుతో మోసగిస్తున్న ఢిల్లీ ముఠా అరెస్టు
కాల్ సెంటర్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన ఢిల్లీకి చెందిన ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలో మొత్తం 14 మంది సభ్యులున్నారు. ప్రైజ్ మనీ వచ్చిందంటూ పలువురికి ఫోన్ చేసి డబ్బులు గుంజుతున్నారని, అలా ఇంతవరకు రూ.4 కోట్లకు పైగా మోసాలకు పాల్పడ్డట్లు తెలిసింది. వారంతా గుర్గావ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications