కోత వద్దు: నీతి అయోగ్లో సిఎం కెసిఆర్(ఫొటో)
భోపాల్: కేంద్ర ప్రభుత్వ పథకాలతో రాష్ట్రాలపై భారం వేయడం తగదని రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు అన్నారు. గురువారం భోపాల్లో జరిగిన నీతి ఆయోగ్ ఉపసంఘం మూడో సమావేశంలో ఆయన మాట్లాడారు.
మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, నాగాలాండ్ సిఎం టిఆర్ జెలియాంగ్, అరుణాచల్ప్రదేశ్ సిఎం నాబంటుకీ, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్దాస్, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ ఏకే సింగ్ హాజరయ్యారు.

రాష్ర్టాలలో అమలు చేస్తున్న కేంద్ర పథకాలలో కేంద్రం వాటా 80 శాతానికి తగ్గకుండా ఉండాలని సిఎం కెసిఆర్ అభిప్రాయపడ్డారు. ఐచ్ఛిక పథకాల నిధులలో కోత వేయడం తగదని అన్నారు. ఈ కోతల వల్ల ఆర్థికంగా మిగులు ఉన్న రాష్ర్టాలపై భారం పెరిగిపోతోందని చెప్పారు. ఆర్థిక సంబంధ బాధ్యత, వార్షిక ప్రణాళిక నిర్వహణ చట్టంపై ఎన్నో ఆకాంక్షలున్నాయని కేసీఆర్ అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిపాదనలను మిగతా సభ్యులు కూడా సమర్థించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు తమ అవసరాలకు అనుగుణంగా సరళంగా వినియోగించుకునేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలలో కేంద్రం వాటా 50 శాతానికి తగ్గకూడదన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై చర్చ జరిగింది.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications