అక్కడ లేవు, కానీ ఉన్నాయి!: సీతమ్మ మంగళసూత్రం లభ్యం
ఖమ్మం: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామ వారి ఆలయంలో మాయమైన 71 గ్రాముల సీతమ్మవారి మంగళసూత్రాలు, లక్ష్మణస్వామివారి లాకెట్ దొరికినట్లు సమాచారం. శనివారం ప్రధాన ఆలయంలోని బంగారు ఆభరణాల బీరువాను అర్చకులు తనిఖీ చేయగా అరలో ఇవి ఉన్నట్లు గుర్తించారు. ఆగస్టు 13 నుంచి 18 వరకు పవిత్రోత్సవాలు జరగడం వల్ల నిత్య కల్యాణాలను నిలిపేశారు.
ఆగస్టు 19న నిత్యకల్యాణం కోసం మూర్తుల ఆభరణాలను పరిశీలించగా ఈ ఆభరణాలు మాయమైనట్లు తేలింది. సీఐ శ్రీనివాసులు నేతృత్వంలో ఒకరిద్దరు అర్చకులపై అనుమానంతో నిఘా ఉంచగా.. అనూహ్యంగా నగల బీరువాలోనే రెండు ఆభరణాలు లభ్యమయ్యాయి.

శనివారం ఈవో రమేష్బాబు మాట్లాడుతూ...ఆభరణాలు ఉండాల్సినచోట లేకపోవడంతోనే వివాదంగా మారిందన్నారు. అర్చకుల్లో కొంతమంది మధ్య పొసగకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు గుర్తించామన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం కనబరచినవారిని సస్పెండ్ చేస్తామన్నారు.
అయితే, ఇంతకుముందు తనిఖీ చేసినప్పుడు కనబడని నగలు...ఇప్పుడు దొరకడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఐదుగురు అర్చకులపై కేసులు నమోదయ్యాయి. బాధ్యులైన వారిని సస్పెండ్ చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని బదిలీ చేస్తామని ఈవో తెలిపారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications