రేవంత్ కూతురు ఎంగేజ్మెంట్కు బాబు, ఏపీ కేబినెట్
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టయిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థానికి ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, సీనియర్ ఏపీ నేతలు, మంత్రులు.. ఇలా అందరు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.
ఎల్లుండి (జూన్ 11న) రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి నిశ్చితార్థం ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ నిశ్చితార్థానికి సీఎం చంద్రబాబు, ఏపీ మంత్రులు అందరు హాజరవ్వాలని నిర్ణయించారు.
బెయిల్ వచ్చేనా?
ఎల్లుండి నిశ్చితార్థం నేపథ్యంలో రేవంత్ రెడ్డికి బెయిల్ వస్తుందా అనే చర్చ సాగుతోంది. ఈ రోజుతో రేవంత్ రెడ్డి కస్టడీ ముగియనుంది. రేపు బెయిల్ పిటిషన్ పైన విచారణ ఉంది. బెయిల్ వస్తుందని రేవంత్ తరఫు న్యాయవాదులు ధీమాగా ఉన్నారు.
రేవంత్ రెడ్డి కస్టడీ నేటితో ముగియనున్నందున ఈ రోజు (మంగళవారం) సాయంత్రం ఐదు గంటలకు ఆయనను ఏసీబీ న్యాయస్థానం ముందు హాజరుపర్చవలసి ఉంది. ఆయన విచారణలో సహకరించలేదని చెబుతూ, మరో రెండు రోజుల కస్టడీ కోరే అవకాశముందని తెలుస్తోంది.