వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీర్ణించుకోలేకపోతున్నా, కుండబద్దలు కొట్టేవారు: దాసరికి బాబు నివాళి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఫిలిం చాంబర్‌లో దాసరి నారాయణ రావు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. దాసరి మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఫిలిం చాంబర్‌లో దాసరి నారాయణ రావు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. దాసరి మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు.

తెలుగు జాతికి, చిత్ర పరిశ్రమకు ఆయన మృతి తీరని లోటు అన్నారు. దాసరి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. తెలుగువారి గుండెల్లో దాసరి ఎప్పటికీ నిలిచిపోతారన్నారు.

పాలకొల్లులో పుట్టి, అత్యంత విశ్వాసంతో ఉన్నత శిఖరాలకు ఎదిగిన వ్యక్తి అన్నారు. ఎప్పుడు బడుగు, బలహీన వర్గాల కోసం ఉద్యమించారని చెప్పారు. సినిమాలు కూడా సమాజం కోణంలోనే ఉంటాయని అభిప్రాయపడ్డారు.

Chandrababu Naidu expresses condolence over death of Dasari Narayana Rao

ఏ విషయమైనా కుండబద్దలు కొట్టే వ్యక్తి అన్నారు. ఎక్కడా రాజీపడలేదన్నారు. తనకు చిన్నప్పటి నుంచి పరిచయం అని చెప్పారు. దాసరితో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. తమ కుటుంబంతో సన్నిహితంగా ఉండేవాడన్నారు.

నేను అంటే దాసరికి అభిమానం అన్నారు. సొంత కుటుంబ సభ్యులుగా ఉండేవాళ్లమన్నారు. ఆయన విలువల కోసం పోరాడారన్నారు. దాసరి ఓ వ్యక్తి కాదని, వ్యవస్థ అన్నారు. దాసరి సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారన్నారు.

English summary
AP CM Chandrababu Naidu expresses condolence over death of Dasari Narayana Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X