'హరీష్ రావు ఓ టైమ్ బాంబులాంటివాడు, కేటీఆర్తో సమన్వయం చేయాలని కేసీఆర్ ఆలోచన'
Recommended Video

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉంటే పోరాటం చేసే పరిస్థితి లేదని, అందుకే తాను గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే బయటకు వచ్చానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం పనితీరుకు నిరసనగా మంగళవారం నుంచి వికారాబాద్లో నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలిపారు.
మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతారని వస్తున్న ప్రచారంపై కూడా ఆయన స్పందించారు. ఆమెకు కాంగ్రెస్ పార్టీ ఎంతో గౌరవం ఇచ్చిందని, బయటకు వెళ్లాల్సిన అవసరమైతే ఆమెకు లేదని చెప్పారు.

తెరాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ఒక పెద్ద టైం బాంబులాంటి వ్యక్తి అని, ప్రస్తుతం హరీష్, కేటీ రామారావుల మధ్య సమన్వయం చేయడానికే కేసీఆర్ ఆలోచిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉమ్మడి రంగారెడ్డిలోని మూడు జిల్లాలకు ఒక్క నీటి చుక్క రాలేదన్నారు. వికారాబాద్లో ఈవీఎంలను తెరిచిన విషయమై పాలనాధికారిని సస్పెండ్ చేయడం, చేయకపోవడంతో తమకు సంబంధం లేదని, మళ్లీ ప్రసాద్ కుమార్ను ఎమ్మెల్యేగా ప్రకటిస్తారా లేదా అనేది చెప్పాలన్నారు. తెరాసలో ఉండి ఇవన్నీ అడిగితే కేసీఆర్ ఊరుకోరని అందుకే బయటకు వచ్చానన్నారు.












Click it and Unblock the Notifications