ఇంటర్ బోర్డును కోర్టుకీడ్చిన బాలల హక్కుల సంఘం
హైదరాబాద్ : విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ఇంటర్ బోర్డుపై ఆగ్రహం పెల్లుబికుతోంది. తప్పుల తడకల ఫలితాలు ఇవ్వడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై బాలల హక్కుల సంఘం హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. విద్యార్థులకు జరిగిన అన్యాయానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం నేత అచ్యుతరావు పిటీషన్లో కోరారు.
ఇంటర్ ఫలితాల్లో జరిగిన తప్పుల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని బాలల హక్కుల సంఘం ఆరోపిస్తోంది. ఇందుకు ఇంటర్ బోర్డు బాధ్యత వహించి మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అచ్యుతరావు పిటీషన్లో కోరారు. పిటీషన్ను స్వీకరించిన హైకోర్టు మధ్యాహ్నం విచారణ జరపనుంది.

ఇంటర్ పరీక్షల మూల్యాంకనం, ఫలితాల్లో జరిగిన అవకతవకల కారణంగా విద్యార్థుల జీవితాలు నాశనం అయ్యాయంటూ మూడు రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇంత రచ్చ జరగుతున్నా ఇంటర్ బోర్డు కార్యదర్శి మాత్రం ఎలాంటి పొరపాట్లు జరగలేదని ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వం నియమించిన కమిటీ సైతం అవకతవకలు జరగలేదని ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో విద్యార్థులను వేదనకు గురిచేసిన ఇంటర్ బోర్డుపై బాలల హక్కుల సంఘం కోర్టు మెట్లెక్కింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications