వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చినజీయర్ స్వామి షష్ఠ్యబ్ది వేడుకలు

By Pratap
|
Google Oneindia TeluguNews

త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి అక్టోబర్ 31 నాటికి 60 ఏండ్లు పూర్తిచేసుకున్నారు. దీనిలో భాగంగా అక్టోబర్ 24 నుంచి నవంబర్ ఐదో తేదీ వరకు జీవా ప్రాంగణంలో షష్ఠ్యబ్ది వేడుకలు జరుగుతాయని, అహోబిల రామానుజస్వామి, దేవనాథ రామానుజ స్వామి తెలిపారు. అధ్యాత్మిక శిక్షణ కోసం 36 ఏండ్లుగా లోకానికి సేవలందించిన చిన జీయర్ స్వామికి 60 ఏండ్లు పూర్త సందర్భంగా ఆయన శిష్యబృందం షష్ఠ్యబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 31న లక్ష దీపోత్సవంతో చిన జీయర్ షష్టిపూర్తి వేడుకలు మొదలయ్యాయి.

నవంబర్ ఆరో తేదీన ఎల్బీ స్టేడియంలో చిన జీయర్ ఆరు పదుల నిండైన వేడుక నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు, ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావులను ఆహ్వానించారు. కేంద్ర మంత్రులు, పలువురు పీఠాధిపతులు, ఆధ్యాత్మిక వేత్తలు పాల్గొంటారని నిర్వహుకులు తెలిపారు. ఇప్పటికే ఎల్బీ స్టేడియం సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. దీంతో ఎల్బీ స్టేడియం పరిసర ప్రంతాలు అద్యాత్మికత శోభ సంతరించుకుంది.

English summary
Tridandi China Jeeyar Swami's 60 birth day celebrations will be held from October 24 tp Noveember 5.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X