ఫాంహౌస్లో కేసీఆర్ను కలిసిన చింతమడక గ్రామస్తులు: నినాదాలతో హోరెత్తించారు
గజ్వేల్: బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR)ను బుధవారం చింతమడక వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి కలిశారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రం (ఫాంహౌస్)లో కేసీఆర్ను కలిసి తమ సంఘీభావం తెలియజేశారు. కేసీఆర్కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చింతమడక గ్రామస్థులకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ వెంట హరీశ్ రావు, పలువురు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
కాగా, తమ అభిమాన నేత కేసీఆర్ను చూసేందుకు గత మూడు రోజులుగా ఎర్రవెల్లి నివాసానికి పార్టీ నేతలు, ప్రజలు, ఇతర ప్రముఖులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. బుధవారం చింతమడక గ్రామం నుంచి వేలాదిగా ప్రజలు తమ సొంత గ్రామ బిడ్డను చూసేందుకు ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్నారు.

అధినేత కేసీఆర్ను చూడగానే జయ జయ ద్వానాలు చేశారు. వారిలో గూడుకట్టుకున్న అభిమానం ఒక్కసారిగా పెల్లుబికింది. కేసీఆర్ను చూసిన వారి అభిమానం కట్టలు తెంచుకుంది. పెద్ద యెత్తున జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకురికారు. వారికి అధినేత కేసీఆర్ అభివాదాలు చేశారు.
కాగా, ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. 60కిపైగా స్థానాల్లో గెలుపొంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అధికారిక నివాసం ప్రగతిభవన్ను ఖాళీ చేశారు. ఆ తర్వాత నేరుగా ప్రైవేట్ వాహనాల్లో ఎర్రవెల్లి ఫౌంహౌస్ చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడే ఉన్నారు.

సీఎం కేసీఆర్ అంటూ ఫ్యాన్స్ నినాదాలు ..కేసీఆర్ రియాక్షన్ చూడండి..!#KCR #CMKCR #BRSParty #Telangana #Oneindiatelugu pic.twitter.com/76a9luqVPo
— oneindiatelugu (@oneindiatelugu) December 6, 2023
కాగా, బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో వజయం సాధించి ప్రతిపక్ష పాత్రను పోషించనుంది. కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్.. తెలంగాణ అభివృద్ధి కోసం ఆ ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు. సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని వెల్లడించారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications