సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరిన ఇంటర్ వివాదం , సీఎం కేసిఆర్ సమీక్ష

ఇంటర్ ఫలితాల ఆందోళనపై తెలంగాణ ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నారు. గత మూడు రోజులుగా విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన తర్వాత నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కాగా ఈనెల విడుదల చేసిన ఇంటర్ పరీక్షల ఫలితాలపై అనేక వివాదాలునెలకొన్న సంగతి తెలిసిందే , ఈనేపథ్యంలోనే 16 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారంటూ హైకోర్టులో సైతం కేసు ఫైల్ అయింది. కాగా కోర్టు సైతం దీనిపై సిరియస్ అయింది. ఈనేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించడం ప్రాధన్యాత సంతరించుకుంది. మరోవైపు అవకతకలపై వేసిన కమిటి నేడు లేదా రేపు నివేదిక ఇవ్వనుందని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. ఇలాంటీ పరిస్థితుల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఆ శాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డి, తోపాటు బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ లు పాల్గోన్నారు. అంతకుముందే పలితాల తీరుపై ఆయన సీరియస్ అయినట్టు తెలుస్తోంది.

cm kcr review meeting on inter board
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+