రైతులు, మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల వరాలు..!!
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల కదన రంగంలోకి దిగుతున్నారు. వార్ ఒన్ సైడ్ చేయాలని లక్ష్యంతో ఉన్నారు. హ్యాట్రిక్ విజయం దిశగా వ్యూహాల అమలు చేస్తున్నారు. సెంటిమెంట్ ను కొనసాగిస్తూ హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు. హుస్నాబాద్ లోనే పార్టీ మేనిఫెస్టో ప్రకటనకు సిద్దమయ్యారు. కాంగ్రెస్ గ్యారంటీ పథకాలను మించి..రైతులు..మహిళలు..బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల వరాల ప్రకటనకు సీఎం కేసీఆర్ సిద్దమయ్యారు.
ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ : ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా మెజార్టీ ఓట్ బ్యాంక్ తమ వైపు తిప్పుకోవటమే లక్ష్యంగా ఎన్నికల వరాల ప్రకటనకు సీఎం కేసీఆర్ సిద్దమయ్యారు. ప్రధానంగా రైతులు..మహిళలు..బీసీలు, మైనారిటీ, మధ్య తరగతి వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చేలా మేనిఫెస్టో ఉండనున్నట్లు తెలుస్తోంది.

సీనియర్ సిటిజన్లకు భద్రత కల్పించేలా మేనిఫెస్టో ఉంటుందని అంచనా వేస్తున్నారు. సాధ్యాసాధ్యాలను చూసే పథకాలను ప్రకటించబోతున్నామని, సంక్షోభం వచ్చినా సంక్షేమం ఆగకూడదన్న లక్ష్యంగా ముందుకెళ్లే విధంగా ప్రభుత్వ ఆదాయ - వ్యయాలను వివరిస్తూ ప్రజల్లో ఆలోచన కలిగించేలా తన ప్రణాళికా అమలు దిశగా కేసీఆర్ సభల్లో ప్రసంగాలకు సిద్దం అవుతున్నారు.
సెంటిమెంట్ కొనసాగిస్తూ : ఇప్పుడున్న సంక్షేమ పథకాలను మరింత పెంచడంతోపాటు కొత్తగా నాలుగదు స్కీముల ప్రకటనకు కసరత్తు కొనసాగుతోందని సమాచారం. వృద్ధాప్య, వితంతు పింఛన్లను మరో రూ.1000 పెంచే అవకాశం ఉంది. రైతు పింఛన్, మహిళలకు మహిళా పింఛన్, గ్యాస్ సబ్సిడీ పెంచే దిశగా ప్రకటన ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
రైతుబంధు సాయం ఎకరానికి మరో రూ.1000 పెంచడంతోపాటు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని రూ.1.25లక్షలకు పెంపు పైనా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. పెట్రోల్, డీజిల్పై రాష్ట్ర పన్ను వాటా వ్యాట్ను కొంత సడలించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.రైతులకు ఉచితంగా ఎరువులు అందించడం, నిరుద్యోగ భృతి, ఆసరా పింఛన్ల పెంపుదల, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పెంపుదల తదితర అనేక పథకాలు ఉన్నట్లు తెలిసింది.

ఎన్నికల వరాలు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఈ నెల 15న జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2014 ,2018 రెండుసార్లు హుస్నాబాద్ నుండి కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని బహిరంగ సభ ద్వారా ప్రారంభించారు. రెండు సార్లు అధికారంలోకి వచ్చారు. ఇదే సెంటిమెంట్ ను కొనసాగిస్తూ మూడోసారి హ్యాట్రిక్ లక్ష్యంతో ఇక్కడ నుంచే ఈ సారి కూడా ప్రచారం ప్రారంభిస్తున్నారు.
ఇప్పటికే అమలవుతోన్న పథకాలు కొనసాగిస్తూనే..మహిళా సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. యువత, గృహిణులు, ఒంటరి మహిళల కోసం ప్రత్యేక పథకాలు బీఆర్ఎస్ మేనిఫెస్టోలో రూపకల్పన చేసినట్లు చెబుతున్నారు. దీంతో, కేసీఆర్ ప్రకటించే మేనిఫెస్టోపై రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications