ఉపాసనకు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!!
మెగా ఇంటి కోడలు.. రాం చరణ్ సతీమణికి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.
ముఖ్యమంత్రి రేవంత్ తనకు అప్పగించిన బాధ్యతల పట్ల ఉపాసన సంతోషం వ్యక్తం చేసారు. సీఎం కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో కాంగ్రెస్ సర్కార్ 'స్పోర్ట్స్ పాలసీ 2025'ను తీసుకొచ్చిన రేవంత్ ప్రభుత్వం తాజాగా 'స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ'ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు చైర్మన్గా సంజీవ్ గోయెంకాను నియమించింది. మెగా కోడలు ఉపాసన కామినేనిని కో చైర్మన్గా నియమించింది.
తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉపాసనకు బాధ్యతలు కేటాయిస్తూ అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ బాధ్యతల కేటాయింపు పైన ఉపాసన స్పందించారు. స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణకు తనను కో చైర్మన్గా నియమించటంపై ఉపాసన సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఈ నియామకం తనకు ఎంతో గౌరవాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చారు. తనకు సంజీవ్ గోయెంకాతో కలిసి పనిచేసే అవకాశం రావటం మరింత గౌరవంగా భావిస్తున్నట్లు ఉపాసన పేర్కొన్నారు.

బోర్డు సభ్యులుగా సన్ టివీ నెట్వర్క్, సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్, ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్, పుల్లెల గోపిచంద్, భూటియా, అభినవ్ బింద్రా, రవికాంత్ రెడ్డి తదితరులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్రీడల్లో తెలంగాణను దేశానికి రోల్ మాడల్గా నిలపాలన్న సంకల్పంతో క్రీడా విధానం తెచ్చామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Honoured to be the Co Chairman of the Sports Hub of Telangana alongside @sanjivgoenka Ji to shape Telangana into a global sports force.
— Upasana Konidela (@upasanakonidela) August 4, 2025
Grateful to Shri @revanth_anumula Garu and the Government of Telangana for this bold vision.
This is a powerful step towards building… pic.twitter.com/Xz3k1LWFnw
ఈ విధానంలో రాజకీయ జోక్యం తగ్గించాలన్న ఉద్దేశంతోనే ప్రైవేటు - పబ్లిక్ భాగస్వామ్యంతో క్రీడాపాలసీని రూపొందించామని తెలిపారు. క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తున్నకార్పొరేట్ సంస్థలు, ఆ రంగంలో విశేష అనుభవం ఉన్న వారిని ఆహ్వానించే ఒక బోర్డును ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రానున్న రోజుల్లో మంచి క్రీడాకారులను తయారు చేయాలన్న లక్ష్యంతో ఈ పాలసీ తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ వెల్లడించారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications