2027 మార్చి తర్వాతే జిల్లాల మార్పులు : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై గత కొంతకాలంగా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న జిల్లాలను రద్దు చేస్తారని, జిల్లాలు సరిహద్దులను మారుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రద్దు అవుతుందనే ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్ పెట్టారు.
కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం రేవంత్
ఇప్పటివరకు జిల్లాల మార్పు గురించి, కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం గురించి, రద్దు చేయడం లేదా సరిహద్దుల మార్పుకు సంబంధించిన అంశాల గురించి ప్రభుత్వం ఎటువంటి ఆలోచనలు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం జనగణన ప్రక్రియ జరుగుతున్న కారణంగా, ఈ సమయంలో మార్పులు చేర్పులు చేయకూడదని కేంద్రం సూచించిందని, జనగణన పూర్తయ్యే వరకు ఎటువంటి మార్పులు ఉండవని ఆయన స్పష్టం చేశారు.

అప్పటివరకు జిల్లాల హద్దులు మార్చే అవకాశం లేదు
కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు మార్చి 31 2027 వ తేదీ వరకు రాష్ట్రంలోని జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులను మార్చకూడదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ గడువు ముగిసిన వెంటనే, జిల్లాల పునర్విభజన కారణంగా తలెత్తిన సమస్యలను పరిష్కరించడం కోసం జ్యుడీషియల్ కమిషన్ ను ఏర్పాటు చేస్తామని కూడా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన ప్రస్తుతం తమ ప్రభుత్వ పరిశీలనలో లేదు
ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది. జరుగుతున్న ప్రచారం అసత్య ప్రచారం అన్నారు. ఏ జిల్లాలను తొలగించడం కానీ, కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన కానీ ప్రస్తుతం తమ ప్రభుత్వ పరిశీలనలో లేదన్నారు.
ప్రజలకు బహిరంగంగా చెప్పి చేస్తాం
ఒకవేళ భవిష్యత్తులో ఏవైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేయాల్సివస్తే ప్రజలకు బహిరంగంగా చెప్పి మరీ చేస్తామని, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే ప్రతిపక్షాల సూచనలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అపోహలు సృష్టించిన భూపాలపల్లి ప్రజలు చైతన్యవంతులని, దుష్ప్రచారాలు నమ్మరని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు.
పాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ హయాంలో కొత్త జిల్లాలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కేవలం పది జిల్లాలు మాత్రమే ఉండేవని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. పాలనా సౌలభ్యం కోసం నాడు కేసీఆర్ ప్రభుత్వం పది జిల్లాలను కొత్తగా మరో 21 జిల్లాలతో ఏర్పాటు చేసిందన్నారు. ఆ తర్వాత ప్రజల డిమాండ్ల మేరకు, స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని 2019 ఫిబ్రవరిలో ములుగు, నారాయణపేట జిల్లాలను కూడా ఏర్పాటు చేశారన్నారు.
శాస్త్రీయ విభజన జరగక క్షేత్రస్థాయిలో అధికారులు, ప్రజలు ఇబ్బంది
దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కి చేరిందని అయితే ఈ జిల్లాలో విభజన శాస్త్రీయంగా జరగకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో అధికారులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అభిప్రాయం ఉంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలను పునర్విభజన చేస్తుందని, మార్పులు చేర్పులు చేస్తుందని ప్రజలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ చర్చకు రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
-
మహిళలకు తులం బంగారం హామీ.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన! -
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
బాసరలో వీఐపీ వాహనాలకు సైతం నో ఎంట్రీ -
గోల్కొండ తారామతి రిసార్ట్ లో డ్రగ్స్ పార్టీ, బాలీవుడ్ నటులు, ఈగల్ టీమ్ షాకింగ్ రైడ్! -
అదే జరిగితే.. హన్మకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటానన్న మాజీ అసెంబ్లీ స్పీకర్ -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు!













Click it and Unblock the Notifications