సీఎం రేవంత్ రెడ్డి చేతల మనిషేనా? తాజా నిర్ణయంతో హరీష్ రావుకు షాక్!!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు విమర్శలు చేసేందుకు ఏ మాత్రం తావివ్వటం లేదు. తెలంగాణ రాష్ట్రంలో పాలన పగ్గాలు చేపట్టిన నాటినుండి పరిపాలనపై తనదైన మార్కు వేస్తున్న రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకోవడంలో ఎలాంటి వెనుకడుగు వేయడం లేదు. ప్రత్యర్థి పార్టీలకు ఏమాత్రం అవకాశం లేకుండా సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.
ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీల నాయకుల నోళ్లు మూతపడేలా చేస్తున్నాయి.తాజాగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగానికి శుభవార్త చెప్పారు. రేవంత్ ఆదేశాలతో యాసంగి సీజన్ కు సంబంధించిన రైతుబంధు నిధులను రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేసే ప్రక్రియ నేటి నుంచి ప్రారంభించనున్నారు అధికారులు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని నేటి నుండి పెట్టుబడి సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి సర్కార్ ను టార్గెట్ చేశారు. రైతులకు పంట పెట్టుబడి సాయం కింద 15 వేల రూపాయలు ఇస్తామని చెప్పారన్నారు.
పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తారో రైతులకు చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ రైతాంగం తమ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తుందని పేర్కొన్న మాజీ మంత్రి హరీష్ రావు ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారని అది కూడా ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
ఇక హరీష్ రావు వ్యాఖ్యలపై సీతక్క వంటి వారి కౌంటర్ ఇచ్చినప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం సైలెంట్ గా పనిచేసుకుపోయారు. పాలన మొదలైన వారం రోజుల్లోనే నిర్ణయం తీసుకున్నారు. నేటి నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడి సాయం అందించాలని రైతులను ఆదుకోవాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించి హరీష్ రావు నోరు మూతపడేలా చేశారు. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు మనిషి కాదు చేతల మనిషి అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications