దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం!
తెలంగాణ రాష్ట్రంలో ఆహార కల్తీపై రేవంత్ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే కల్తీ ఆహారంపై యుద్ధం ప్రకటించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆహార పదార్థాల్లో నాణ్యత లేకపోవడం, కల్తీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇకపై ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోదని సీఎం రేవంత్ హెచ్చరించారు. కల్తీ ఆహారం తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఫుడ్ కల్తీపై తనిఖీలు
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ఇన్స్పెక్టర్లు విస్తృత తనిఖీలు చేపట్టారు. హోటళ్లు, రెస్టారెంట్లు, గోదాములు, రేషన్ దుకాణాల్లో ఆహార నాణ్యతను పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద ఆహార నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపిస్తూ ప్రజలకు సురక్షిత ఆహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ తనిఖీల వల్ల పలుచోట్ల కల్తీ ఘటనలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.

టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం
ఆహార కల్తీని పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖతో పాటు ICRISAT నిపుణులను కలుపుకుని టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కమిటీ ఆహార నాణ్యతపై సమగ్ర విధానాన్ని రూపొందించి అమలు చెయ్యాలని భావిస్తున్నారు.
కఠిన నిబంధనలు అమలు చేసేలా నిర్ణయం
ఈ టాస్క్ ఫోర్స్ కల్తీకి కారణమవుతున్న మూలాలను గుర్తించి, వాటిని నిర్మూలించేందుకు కఠిన నిబంధనలు రూపొందిస్తుంది. అలాగే ఉత్పత్తి నుంచి వినియోగం వరకు ప్రతి దశలో నాణ్యత ప్రమాణాలను పాటించేలా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయనుంది. అవసరమైతే కొత్త చట్టాలను తీసుకువచ్చే అవకాశముందని కూడా ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది.
ఆహార కల్తీకి పాల్పడే వారికి తీవ్ర హెచ్చరికలు
ప్రజల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ఆహార రంగంలో పెద్ద మార్పులకు కారణం అవుతాయన్న భావన ఉంది. కల్తీ ఆహారంపై కట్టడి విధించడం ద్వారా ప్రజలకు నాణ్యమైన, సురక్షిత ఆహారం అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆహార కల్తీకి పాల్పడే వారికి ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలను జారీ చేస్తుంది. ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకుంది.
.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
మూసీ తీరాన మహత్తరం -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
ఆ ఉద్యోగులకు బిగ్ షాక్.. జీతంలో ప్రతి నెలా రూ. 10వేలు కట్: సీఎం రేవంత్ సంచలన నిర్ణయం -
కేసీఆర్ దళిత వ్యతిరేకి: సీఎం రేవంత్ రెడ్డి -
వారికి గుడ్ న్యూస్.. కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ -
ఆర్టీవో ఆఫీసులకు తిరిగే పని లేకుండా తెలంగాణా వాహనదారులకు సీఎం రేవంత్ శుభవార్త! -
మూసీ తీరాన ఆధ్యాత్మిక వైభవం.. 700 కోట్లతో భారీ ఆలయాల ప్రాజెక్ట్.. సీఎం శంకుస్థాపన -
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
మూసీపై బిగ్ స్టెప్- చెప్పిందే చేసిన రేవంత్











Click it and Unblock the Notifications