క్రిస్మస్ కానుకిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. 33 కోట్లతో వారి కోసం!
తెలంగాణ రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా చేయడానికి ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లను చేస్తుంది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో శనివారం జరిగిన అధికారిక ఉత్సవాలలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమయంలో క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కీలక నిర్ణయాలను ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా చేసుకోవడానికి రేవంత్ రెడ్డి సర్కార్ గిఫ్ట్ ఇచ్చినట్లుగా ప్రకటించారు.
ప్రతి చర్చికి 30 వేల రూపాయల నిధులు
రాష్ట్రవ్యాప్తంగా 7000 చర్చిలకు క్రిస్మస్ ఖర్చుల నిమిత్తం 33 కోట్ల రూపాయలను కేటాయించినట్టు దీపక్ జాన్ తెలిపారు. ప్రతి చర్చికి 30 వేల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి క్రైస్తవ మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.

డిసెంబర్ మంత్ మిరాకిల్ మంత్ అన్న రేవంత్ రెడ్డి
క్రిస్మస్ పండుగను అత్యంత ఘనంగా నిర్వహించడానికి భారీ నిధులను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ డిసెంబర్ మంత్ కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు కూడా మిరాకిల్ మంత్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.డిసెంబర్ మంత్ కి చాలా ప్రాధాన్యత ఉందని, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ డిసెంబర్లోనే పుట్టారని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్లోనే అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
రాష్ట్రంలో వారిపై చర్యలు తప్పవు.. రేవంత్ హెచ్చరిక
ఏపీలో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా కూడా, తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చి రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ త్యాగం వెలకట్టలేనిది అని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఏసుప్రభు బోధించిన శాంతి, ప్రేమ మార్గంలో ప్రయాణం చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసిన వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
త్వరలో అసెంబ్లీ సమావేశాల్లో హేట్ రేట్ చట్టం
త్వరలో అసెంబ్లీ సమావేశాలలో ద్వేషపూరిత ప్రసంగాలు నివారణకు హేట్ రేట్ చట్టం ప్రవేశ పెడతామంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. దేశంలో వైద్య విద్య అభివృద్ధిలో క్రిస్టియన్ మిషనరీల కృషి అపారంగా ఉందని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి సగటు మనిషి జీవన ప్రమాణాలను పెంచడంలో వారి పాత్ర కీలకం అంటూ ప్రశంసించారు. క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
-
పెట్రోల్ కొరత లేదు.. బంకుల్లో ఫుల్ స్టాక్! తేల్చిచెప్పిన ప్రభుత్వం -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
సీఎం గారు లక్షమందిని కాపాడండి.. రేవంత్ రెడ్డికి వినూత్న విజ్ఞప్తి! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications