తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా గులాం నబీ ఆజాద్! త్వరలో అధికారిక ప్రకటన
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోఅధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అందుకు తగినట్లుగా ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు యాత్ర చేస్తున్నారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ను నియమించనుందని తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో ఏపీ వ్యవహారాల్లో ఆజాద్ క్రియాశీలకంగా వ్యవహరించారు.

జమ్ము కాశ్మీర్లోని దోడా జిల్లాలో గులాం నబీ ఆజాద్ జన్మించారు. ఆయన జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పని చేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా పని చేశారు.
కాగా, ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని పార్టీ అధిష్టానం దృష్టి సారించింది ఈ క్రమంలో నిన్నటి వరకు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్గా దిగ్విజయ్ సింగ్ స్థానంలో కేరళ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఊమన్ చాందీని ఏపీ ఇంచార్జిగా నియమిస్తూ ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈయన కాంగ్రెస్లో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications