కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ ఘన విజయం
తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలతో పాటు జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నిక లెక్కింపు ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ భారీ మెజార్టీతో గెలిచారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టినట్లయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.
ఈ ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున లాస్య నందిత సోదరి నివేదిత, బీజేపీ అభ్యర్థిగా టీఎన్ వంశ తిలక్ సహా 15 మంది పోటీలో నిలిచారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మే 13వ తేదీన ఉపఎన్నిక పోలింగ్ జరిగింది. అందులో 2,53,706 మంది ఓటర్లు ఉంటే.. 1,30,929 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో 47.85 శాతం ఓట్లు పోలవగా, ఈసారి 51.61 శాతం నమోదైంది.

మొత్తం 17 రౌండ్లలో ఓట్లు లెక్కింపులో భాగంగా 14 టేబుళ్లు ఈసీ ఏర్పాటు చేసింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెెక్కింపుతో ప్రక్రియ మొదలైంది. అనంతరం పలు రౌండ్లలో జరిగిన లెక్కింపులో చివరగా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ విజేతగా నిలిచారు.
కాగా, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతితో 2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన కుమార్తె లాస్య నందిత బీఆర్ఎస్ తరుఫున పోటీ చేసి విజయం సాధించారు. కొన్ని నెలలకే రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మళ్లీ ఆ పార్టీ తరఫున సాయన్న చిన్న కుమార్తె నివేదిత బరిలో నిలవగా, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన శ్రీగణేశ్ ఈ సారి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు.
బీజేపీ తరఫున వంశతిలక్ పోటీ చేశారు. అయితే, 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్కు ఒక్క సీటు రాలేదు. దీంతో కంటోన్మెంట్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విస్తృతంగా ప్రచారం చేసి ఎట్టకేలకు విజయం సాధించింది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications