వీడిన కానిస్టేబుల్ భార్య పూజ ఆత్మహత్య మిస్టరీ: డైరీలో నోట్
హైదరాబాద్: గత ఐదు రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ పూజ మృతికేసులో మిస్టరీ వీడింది. పూజ డైరీ లభించడంతో ఆ మిస్టరీ వీడింది. ప్రతి విషయాన్ని ఆమె తన డైరీలో రాసినట్లు తెలుస్తోంది. ఆమె భర్త వరకట్నం కోసం వేధిస్తుండేవాడని పూజ తన డైరీలో రాసుకోవడంతో ఇప్పటి వరకు ఆమె మృతిపై నెలకొన్న సస్పెన్స్కు తెరపడింది.
గత ఐదురోజుల క్రితం కంచన్ బాగ్ పోలీస్స్టేషన్ పరిధిలో పూజ(22) అనే వివాహిత ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే అమె భర్త అయిన కానిస్టేబుల్ ప్రవీణ్కుమార్ కట్నం కోసం వేధిస్తుండేవాడని, దీనికి మనస్తాపం చెందిన ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
చాంద్రాయణగుట్ట గాంధీబొమ్మ సమీపంలో నివసించే జి.ప్రవీణ్ కంచన్బాగ్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. అంతకు ముందు ప్రవీణ్ సీఆర్పీఎఫ్ క్యాంపస్లో నివసించేవాడు. అప్పట్లో ఇంటి పక్కనే ఉన్న క్వార్టర్స్ ఉండే పూజ(21)ను ప్రేమించి 2014లో వివాహం చేసుకున్నాడు.
ఎప్పటి లాగే ఆ రోజు మాదిరిగానే ప్రవీణ్ ఉద్యోగానికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చాడు. తలుపులు తట్టగా భార్య పూజ తీయలేదు. దీంతో ప్రవీణ్ పక్కింటి పైభాగం నుంచి ఇంట్లోకి చూడగా పూజ ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.