భూపాలపల్లిలో కరోనా టెన్షన్: ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్!!
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి కేసుల పెరుగుదలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అయినప్పటికీ కేసుల నమోదు కొనసాగుతుంది .భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది అని తాజాగా నమోదవుతున్న కేసులతో అర్థమవుతుంది. అన్ని రాష్ట్రాలలోనూ రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయాల్సిన అవసరం ప్రస్తుతం కనిపిస్తుంది.
తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆ కుటుంబంలోని ఒకరు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబంలోని మిగతా నలుగురు వారి నివాసంలోనే ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే వైద్యుల సలహాల మేరకు వారు ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్నారు.

కరోనా మహమ్మారి బారిన పడిన కుటుంబం వివరాల్లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన 65 సంవత్సరాల సుంకర యాదమ్మ మొదట కరోనా బారిన పడ్డారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎం కి తరలించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
ఇక ఆమె కుటుంబంలోని 42 సంవత్సరాల భాస్కర్, 30 సంవత్సరాల వీణ, పిల్లలు ఆకాష్, మిద్దిని కూడా కరోనా బారిన పడ్డారు. వారంతా వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం వీరందరూ బాగానే ఉన్నారని సమాచారం. అయితే ఒకే కుటుంబంలో ఐదుగురు కరోనా మహమ్మారి బారిన పడటంతో, ఇంకా వారి ద్వారా ఎంతమందికి వ్యాప్తి చెందిందో అన్న ఆందోళన వ్యక్తం అవుతుంది.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, స్వీయ జాగ్రత్తలు పాటించాలని, బహిరంగ స్థలాలలో మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని ఇప్పటికే వైద్యాధికారులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు. ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని సిద్ధం చేసుకున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications