హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో ఇంటింటికి కరోనా వ్యాక్సినేషన్: రెండో తీసుకోవాలంటూ సీఎస్ పిలుపు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఈ క్రమంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో శనివారం నుంచి కాలనీల్లో ప్రత్యేక రెండో డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీ అవసరమైన వారి ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్‌ ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని సన్ రైజ్ హోమ్ కాలనీలో ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పరిశీలించారు. ఆయన వెంట వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. ఇంటింటికీ రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Corona vaccination status in telangana state.

రాష్ట్రంలో ఇప్పటికే మూడు కోట్ల మందికి పైగా కోవిడ్‌ వ్యాక్సిన్ అందించామన్నారు. కరోనా నివారణకు కేవలం టీకా తీసుకోవడమే మార్గమని సీఎస్ స్పస్టం చేశారు. అనంతరం వైద్య శాఖ కార్యదర్శి రిజ్వీ మాట్లాడుతూ.. హైదారాబాద్ నగరంలో దాదాపు 90 శాతం పౌరులకు వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. శనివారం నుంచి పది రోజులపాటు ఏర్పాటు చేసిన 150 మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా రెండో డోస్ కూడా ఇస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత జీహెచ్ ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ.. నగరంలో రెండు మూడు కాలనీలకు ఒక ప్రత్యేక కేంద్రం వద్ద ఈ మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా రెండో డోస్ వ్యాక్సిన్ అందజేస్తాం. ప్రతిరోజూ దాదాపు 450 కాలనీలను కవర్ చేస్తాం. అవసరమైతే వాక్సినేషన్ కార్యక్రమాన్ని మరిన్ని రోజులు పొడిగిస్తామని తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించిన విషయం తెలిసిందే.

తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి

తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 38,442 మంది నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 174 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.

తాజాగా, నమోదైన 174 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,71,174కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా ఇద్దరు మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3954గా ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 2005 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 202 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,63,124కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,096 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 03, భద్రాద్రి కొత్తగూడెంలో 03, జీహెచ్ఎంసీలో 65. జగిత్యాలలో 04, జనగామలో 00, జయశంకర్ భూపాలపల్లిలో 00, జోగులాంబ గద్వాలలో 00, కామారెడ్డిలో 03, కరీంనగర్‌లో 14, ఖమ్మంలో 05, కొమురంభీం ఆసిఫాబాద్ లో 00, మహబూబ్‌నగర్‌లో 03, మహబూబాబాద్‌లో 02, మంచిర్యాలలో 03, మెదక్‌లో 01, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 13, ములుగులో 00, నాగర్ కర్నూలులో 02, నల్గొండలో 06, నారాయణపేటలో 01, నిర్మల్‌లో 02, నిజామాబాద్‌లో 00, పెద్దపల్లిలో 05, రాజన్న సిరిసిల్లలో 02, రంగారెడ్డిలో 11, సంగారెడ్డిలో 04, సిద్దిపేటలో 03, సూర్యాపేటలో 03, వికారాబాద్ లో 00, వనపర్తిలో 01, వరంగల్ రూరల్‌లో 03, వరంగల్ అర్బన్‌లో 09, యాదాద్రి భువనగిరిలో 03 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 7 జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

English summary
Corona vaccination status in telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X