భార్య వెంటపడిన యువకుడి హత్య: దంపతుల లొంగుబాటు
ఆదిలాబాద్: ఓ యువకుడిని గొంతు కోసి దారుణంగా హత్య చేసిన దంపతులు శుక్రవారంనాడు ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ నెల 7వ తేదీన కోటపల్లి మండలం పారుపల్లి సమీపంలో శ్రీనివాస్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
కొమిరె రమేష్, అతని భార్య విమల కలిసి ఈ హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే, దంపతులిద్దరు అజ్ఞాతంలోకి వెళ్లారు. వారి కోసం పోలీసులు గాలిస్తూ వచ్చారు. ఈ విషయం తెలిసిన భార్యాభర్తలు శుక్రవారం స్వయంగా వచ్చి పోలీసుల ముందు లొంగిపోయారు.
రమేష్ భార్య విమలను శ్రీనివాస్ లైంగికంగా వేధిస్తుండడంతో ఈ హత్య చేసినట్లు వారు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం.
ఆదిలాబాద్ జిల్లాలో వేగంగా వెళ్తున్న బైక్ను డిసిఎం వానహం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరొకతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కేరామెరి మండలం బారముడి గ్రామ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది.
మోడీ గ్రామానికి చెందిన ఆత్రం భీంరామ్, లింగారావు బైక్పై కేరామెరి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో వారి బైక్ డిసిఎం వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భీమ్ రావు అక్కడికక్కడే మరణించగా, లింగారావు తీవ్రంగా గాయపడ్డాడు.