ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్య వెంటపడిన యువకుడి హత్య: దంపతుల లొంగుబాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్: ఓ యువకుడిని గొంతు కోసి దారుణంగా హత్య చేసిన దంపతులు శుక్రవారంనాడు ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ నెల 7వ తేదీన కోటపల్లి మండలం పారుపల్లి సమీపంలో శ్రీనివాస్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

కొమిరె రమేష్, అతని భార్య విమల కలిసి ఈ హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే, దంపతులిద్దరు అజ్ఞాతంలోకి వెళ్లారు. వారి కోసం పోలీసులు గాలిస్తూ వచ్చారు. ఈ విషయం తెలిసిన భార్యాభర్తలు శుక్రవారం స్వయంగా వచ్చి పోలీసుల ముందు లొంగిపోయారు.

రమేష్ భార్య విమలను శ్రీనివాస్ లైంగికంగా వేధిస్తుండడంతో ఈ హత్య చేసినట్లు వారు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం.

Couple surrender before police in a murder case

ఆదిలాబాద్ జిల్లాలో వేగంగా వెళ్తున్న బైక్‌ను డిసిఎం వానహం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరొకతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కేరామెరి మండలం బారముడి గ్రామ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది.

మోడీ గ్రామానికి చెందిన ఆత్రం భీంరామ్, లింగారావు బైక్‌పై కేరామెరి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో వారి బైక్‌ డిసిఎం వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భీమ్ రావు అక్కడికక్కడే మరణించగా, లింగారావు తీవ్రంగా గాయపడ్డాడు.

English summary
A couple Ramesh and vimala surrendered before police in murder case in Adilabad district of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X