దారుణం: తల్లితో వివాహేతర సంబంధం, కూతురిని గర్భవతిని చేశాడు
తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమె కుమార్తెను కూడ గర్భవతిని చేసిన నిందితుడికి జీవితఖైదును విధిస్తూ సైబరాబాద్ ఒకటో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సునీత మంగళవారం నాడు తీర్పు చెప్పారు.
రంగారెడ్డి: తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమె కుమార్తెను కూడ గర్భవతిని చేసిన నిందితుడికి జీవితఖైదును విధిస్తూ సైబరాబాద్ ఒకటో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సునీత మంగళవారం నాడు తీర్పు చెప్పారు.
2015 లో మేడ్చల్ ప్రాంతానికి నాయక్ చంద్ర వచ్చాడు. ఆయన కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు. మేడ్చల్ ప్రాంతంలోని హోటల్ లో పనిచేస్తున్నారు.అయితే అక్కడే పనిచేస్తున్న ఓ మహిళతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వారిద్దరి మద్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఆమెకు ఇద్దరు కుమార్తెలు. వారిద్దరూ చదువుకొంటున్నారు. ఆమె పెద్ద కుమార్తెను లొంగదీసుకొని గర్భవతిని చేశారు. ఈ విషయం చిన్న కూతురుకు తెలియడంతో ఎవరికీ చెప్పకూడదని కరెంట్ తీగతో కొట్టి హింసించాడు.
అయితే ఆ బాలిక స్కూల్ టీచర్లకు చెప్పింది. దీంతో వారు మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. నాయక్ చంద్రను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. కేసు పూర్వాపరాను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి జీవితఖైదును విధించినట్టుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను రావుల వెంకట్ రెడ్డి తెలిపారు. అంతేకాదు చిన్న కుమార్తైను హింసించినందుకుగాను మూడేళ్ల జైలు శిక్షను విధించింది. ఈ ఘటనతో ఆ మహిళ మతిస్థిమితం కోల్పోయిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.