Madhuri Rathod : నన్ను అనవసరంగా కొట్టారు.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన మాధురి రాథోడ్!
Madhuri Rathod : ప్రముఖ డ్యాన్సర్లు మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి వివాదం గురించి అందరికీ తెలిసిన విషయమే. 'బాసింగ బలాలు' అనే పాట ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్ ఈశ్వర్ సాయి, నిమ్మతోట వనంలో సాంగ్ ఫేమ్ మాధురి రాథోడ్ ఇద్దరూ కలిసి చాలా పాటలు చేశారు. వీరిద్దరి మధ్య రిలేషన్ గురించి చోటుచేసుకున్న ఓ ఊహించని వివాదం ఎంత వైరల్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో జరిగిన ఈ వివాదం తీవ్ర కలకలం రేపింది. ఈ వివాదంతో మాధురి రాథోడ్ పేరు మార్మోగిపోతోంది.
ఈ నేపథ్యంలో తనప అకారణంగా దాడి చేసి, అసభ్య పదజాలంతో దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జానపద కళాకారిణి మాధురి రాథోడ్ వేములవాడ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 19న రెడ్డి భవన్ లో ఉన్న సమయంలో తోటి నటుడు ఈశ్వర్ సాయి భార్య శరణ్య కొందరితో కలిసి వచ్చి అకారణంగా అసభ్యకరమైన భాషతో దూషించడమే కాకుండా దాడి కూడా చేశారని మాధురి రాథోడ్ ఫిర్యాదులో పేర్కొంది. ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఎలాంటి కారణం లేకుండానే తనను బూతులు తిడుతూ, భౌతికంగా దాడి చేసి చేయి చేసుకుందని మాధురి రాథోడ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

ఈ గొడవను ఉద్దేశపూర్వకంగా వీడియోగా చిత్రీకరించారని.. అంతే కాకుండా తన వద్ద ఉన్న సుమారు రూ.50 వేల విలువైన ఐఫోన్ ను దొంగిలించారని మాధురి రాథోడ్ తీవ్ర ఆరోపణలు చేసింది. సదరు వీడియోలను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అప్లోడ్ చేసి తనపై అసత్య ప్రటారం చేస్తూ సమాజంలో తన పరువుకు భంగం కలిగించారని.. ఈ క్రమంలో తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా వార్తలు ప్రసారం చేసిన పలు మీడియా సంస్థలపై కూడా చర్యలు తీసుకోవాలని మాధురి రాథోడ్ ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈశ్వర్ సాయి భార్య శరణ్యతో పాటు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు వేములవాడ సీఐ వీరప్రసాద్ వెల్లడించారు. కేసు నమోదు చేసి ఘటనపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వివరించారు.













Click it and Unblock the Notifications