అధికారిక లాంఛనాలతో రేపు దాసరి అంత్యక్రియలు: మంత్రి తలసాని
తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతూ కిమ్స్ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి కన్నుమూసిన ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో బుధవారం చేవెళ్లలోని ఫాంహౌస్లో జరగనున్నాయి.
హైదరాబాద్: తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతూ కిమ్స్ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి కన్నుమూసిన ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు పార్థివ దేహాన్ని ఆయన నివాసానికి తరలించారు.
బుధవారం చేవెళ్లలోని ఫాంహౌస్లో ఆయన అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వెల్లడించారు. దాసరి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగేలా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేసినట్లు మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ చలనచిత్ర పరిశ్రమలో పులిలాగ జీవించిన వ్యక్తి దాసరి అని అన్నారు. చలనచిత్ర పరిశ్రమలో ఎందరినో పైకి తెచ్చిన మహానుభావుడు అని కొనియాడారు.
దాసరి నారాయణ రావు పార్ధివ దేహానికి బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి ప్రజలు నివాళులర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం పదిన్నరకు దాసరి ఇంటి నుంచి అంతిమ యాత్ర ప్రారంభం అవుతుంది.
చేవెళ్ల రోడ్లోని ఫాంహౌస్లో దాసరి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. భార్య సమాధి పక్కనే ఆయన సమాధి కట్టనున్నారు. దాసరి మృతికి సంతాపంగా రేపు తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమతోపాటు, సినిమా థియేటర్లు కూడా బంద్ పాటించనున్నాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications