కిరాతకం:వివాహేతర సంబంధం వద్దన్నందుకు తల్లిపై ఇలా, ఐదు రోజుల తర్వాతిలా..
బిడ్డను సక్రమ మార్గం వెళ్ళాలని హెచ్చరించింది ఓ తల్లి.అయితే ఆమె తన పద్దతిని మార్చుకోకపోగా చివరకు తల్లినే హత్య చేసింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకొంది.
మహబూబ్ నగర్ :బిడ్డను సక్రమ మార్గం వెళ్ళాలని హెచ్చరించింది ఓ తల్లి.అయితే ఆమె తన పద్దతిని మార్చుకోకపోగా చివరకు తల్లినే హత్య చేసింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకొంది.
బిడ్డలు పుట్టగానే వారి భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఆలోచిస్తారు.వారిని సన్మార్గంలో పయనించేలా చూస్తారు.అయితే ఓ తల్లి తన కూతురును సన్మారంగంలో పెట్టేలా ప్రయత్నించి విఫలమైంది. చివరకు ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది.
మహాబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం ఇప్పటూర్ లో ఈ దారుణం చోటుచేసుకొంది. వివాహేతర సంబంధానికి తన తల్లి అడ్డుగా ఉందని భావించి తల్లినే హత్య చేసింది ఓ కూతురు. మానవత్వానికే మచ్చతెచ్చేలా ప్రవర్తించింది ఆమె.
వివాహేతర సంబంధం వద్దని తల్లి కూతురును హెచ్చరిస్తోంది.అయితే ఆమె హెచ్చరికలను కూతురు పెడచెవిన పెట్టింది.అంతేకాదు తన వివాహేతర సంబంధాలను కొనసాగిస్తూ వచ్చింది.
తల్లి ఉంటే తన వివాహేతర సంబంధం కొనసాగదని భావించిన ఆమె వెంటనే తల్లిని హత్య చేయాలని భావించి ఆమెను హత్య చేసింది. ఐదు రోజుల పాటు తల్లి మృతదేహన్ని ఇంట్లోనే ఉంచింది. ఈ మృతదేహన్ని బయటకు తీసుకెళ్ళే వీలు లేకపోవడంతో ఆమె ఇంట్లోనే శవాన్ని దాచింది.
అయితే ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే ఈ సమాచారం ఆధారంగా పోలీసులు ఇంట్లో శవాన్ని గుర్తించారు. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు.