సెల్ఫోన్ బదులుగా సిమెంట్ గడ్డ: ఆన్లైన్ కొనుగోలులో మోసం
ఆన్ లైన్ లో సెల్ ఫోన్ బుక్ చేసుకున్న ఓ యువకుడికి పార్సిల్ లో సిమెంట్ గడ్డలు పంపించారు.
వరంగల్ : దేశం మొత్తం నగదు రహిత లావాదేవీలను అనుసరిస్తుండగా... అదే స్పీడులో మోసాలు సైతం జరుగుతున్నాయి. రోజు గడిచినకొద్దీ ఆన్లైన్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హన్మకొండలో ఓ యువకుడు సెల్ఫోన్ కొనుగోలు చేసేందుకు ఆన్లైన్లో డబ్బు చెల్లించాడు.
తీరా అతడి ఇంటికి పార్శిల్ కి వచ్చాక, ఆతృతతో తెరిచి చూస్తే.. అందులో సిమెంటు గడ్డలు దర్శనమిచ్చాయి. దీంతో బిత్తరపోవడం ఆ యువకుడి వంతైంది. వెంటనే అతడు హన్మకొండ పోలీసుకు ఫిర్యాదు చేశాడు.

పోలీసు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... హన్మకొండ కిషన్పురకు చెందిన సీహెచ్. మహేశ్వర్ అనే వ్యక్తి ఈనె 15న ఓ కంపెనీ ద్వారా రూ. 5178 మివ గ సెల్ఫోన్ను ఆన్లైన్లో బుక్ చేశాడు. అదే సమయంలో డబ్బును క్రెడిట్ కార్డు ద్వారా ముందుగానే చెల్లించినట్లు చెప్పాడు. ఈ క్రమంలో సెల్ఫోన్ వస్తుందని 8 రోజుపాటు వేచి చూస్తుండగా శుక్రవారం ఆయన పనిచేస్తున్న సంస్థ అడ్రస్కు ఓ వ్యక్తి సెల్ వచ్చిందని పార్శిల్ ఇచ్చి వెళ్లాడు.
బాక్స్ తెరిచి చూడగా సిమెంటు గడ్డలు వచ్చినట్లు గుర్తించాడు. వెంటనే హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బాధితుడు మహేశ్వర్ తెలిపాడు. సదరు సంస్థపై చర్యతీసుకోవాని, నష్టపోయిన తన డబ్బును తిరిగి ఇప్పించాని పోలీసును విజ్ఞప్తి చేశృాడు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు తెలిపారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications