మహారాష్ట్ర,తెలంగాణ సరిహాద్దుల్లో భద్రతను పరిశీలించిన డిఐజి రవివర్మ
జయశంకర్ భూపాలపల్లి : ఏఓబి లో ఎన్ కౌంటర్ నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దుల్లో భద్రతను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. మావోలు గోదావరిని దాటి జయశంకర్ భూపాలపల్లిలోకి ప్రవేశించే అవకాశం ఉన్నందున పోలీసులు ముందుజాగ్రత్తలు తీసుకొంటున్నారు.
ఏఓబీలో జరిగిన ఎన్ కౌంటర్ లో 28 మంది మావోయిస్టులు మరణించారు.ఈ ఘటనతో జయశంకర్ జిల్లా సరిహద్దుల్లో భద్రత చర్యలను వరంగల్ రేంజ్ డిఐజీ రవివర్మ పర్యవేక్షించారు.24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని ఆయన పోలీసులకు సూచించారు. ఏఓబీ ఎన్ కౌంటర్ కు ప్రతీకారం కోసం మావోలు అవకాశం చూస్తుంటారని ఆయన పోలీసలను హెచ్చరించారు.
జయశంకర్ జిల్లాకు మహారాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. ఈ ప్రాంతంలోనే ఉన్న మహాదేవ్ పూర్ కు కొత్తగా పోలీస్ సబ్ డివిజన్ మంజూరైంది.పోలీస్ సబ్ డివిజన్ ఏ ప్రాంతం వరకు విస్తరించి ఉంది.ఠాణా భద్రత తదితర అంశాలను ఆయన ఆరా తీశారు.మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు.

ఒఢిశా ఎన్ కౌంటర్ లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన గాజర్ల రవి అలియాస్ ఉదయ్ కూడ మరణించారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో జిల్లాలో మావోలు విద్వంసానికి పాల్పడే అవకాశం ఉందని పోలీసులను ఆయన అప్రమత్తం చేశారు.24 గంటలపాటు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. గొదావరి ని దాటి జయశంకర్ జిల్లాలోకి మావోలు వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులకు ఆయన పలు సూచనలు చేశారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications