దిశా కేసు... ఎన్హెచ్ఆర్సీకి కీలక సాక్ష్యాలు .. మొత్తం ఎపిసోడ్ పై నివేదికలు ఇచ్చిన సైబరాబాద్ పోలీ
దిశ అత్యాచారం,హత్య,ఆపై నిందితుల ఎన్కౌంటర్ గురించి జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ బృందం అన్ని అంశాలపై క్షుణ్ణంగా విచారణ జరుపుతుంది. ఇప్పటికే సంఘటన స్థలాలను పరిశీలించి,ఆసుపత్రిలో భద్రపరిచిన మృతదేహాలను పరిశీలించి,ఇటు దిశ తల్లిదండ్రుల తోనూ, అటు ఎన్కౌంటర్ మృతుల తల్లిదండ్రులతోనూ మాట్లాడారు జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు. ఇక తాజాగా పోలీసులతో కూడా మాట్లాడిన సభ్యులు పోలీసుల వద్ద నుండి కీలక ఆధారాలను తీసుకున్నారు.
ఎన్హెచ్ఆర్సీ సభ్యుల బృందాన్ని కలిసి పోలీసులు దిశ హత్య కేసుకు సంబంధించి ఆమెపై రేప్ జరిగినట్టు,అలాగే హత్యను కూడా నిందితులే చేసినట్లుగా కీలక ఆధారాలు ఇచ్చారు. ఇక అంతే కాదు ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చిన నివేదికను,దిశ కాల్చివేత కు సంబంధించిన ఆధారాలతో సహా అన్ని ఆధారాలను సైబరాబాద్ పోలీసులు ఎన్హెచ్ఆర్సీ బృందానికి ఇచ్చారు. దిశ కేసులో కీలకంగా ఉన్న శాస్త్రీయ ఆధారాలు అన్నింటిని ఎన్హెచ్ఆర్సీ ముందు పెట్టిన సైబరాబాద్ పోలీసులు సంఘటనా స్థలంలో దొరికిన రక్తం మరకలను, లారీ క్యాబిన్లో దొరికిన రక్తం మరకలను కూడా సేకరించి జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు ముందుంచారు.

ఘటనా స్థలం తో పాటు లారీ జరిగిన సీసీటీవీ ఫుటేజీని కమిషన్ ముందు ఉంచిన పోలీసులు, కొత్తూరు సమీపంలో నిందితులు కొన్న పెట్రోల్ తాలూకు సిసిటివి ఫుటేజ్ ను కూడా అందించారు. ఇక అంతే కాదు రక్తపు మరకల ఆధారంగా డీఎన్ఏ రిపోర్ట్ తో పాటుగా అన్ని నివేదికలను పోలీసులు ఎన్ హెచ్ ఆర్ సి సభ్యులకు ఇచ్చారు. ఇక అంతే కాదు ఈ కేసుకు సంబంధించి, అన్ని రకాలైన వివరాలను తేదీలు, టైం లతో సహా ఎన్హెచ్ఆర్సీ ముందు ఉంచిన పోలీసులు దిశ అత్యాచారం,హత్య చేసింది వారేనని,సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయడానికి తీసుకునే క్రమంలో దాడిచేసి తప్పించుకునే ప్రయత్నం చేయగా ఎన్కౌంటర్ చేశామని ఎన్కౌంటర్ కు సంబంధించిన ఆధారాలను సైతం జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందుంచారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications