మోడీ సైన్యంలో సైనికురాలిని.. పాలమూరును గెలిచి కానుకగా ఇద్దాం : డీకే అరుణ
మహబూబ్నగర్ : పాలమూరు పార్లమెంటరీ స్థానం గెలిచి.. ప్రధాని నరేంద్ర మోడీకి గిఫ్ట్ ఇద్దామని పిలుపునిచ్చారు మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కోవడమే గాకుండా.. సీఎం కేసీఆర్ నిరంకుశ పాలనను అంతమొందిస్తానని తెలిపారు. అందుకే మోడీ సైన్యంలో తానొక సైనికురాలిగా చేరినట్లు చెప్పారు.
శుక్రవారం పాలమూరు వేదికగా దక్షిణాది ఎన్నికల శంఖారావం పూరించారు మోడీ. అందులో భాగంగా అమిస్తాన్పూర్లోని భూత్పూర్ ఐటీఐ కళాశాల మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో డీకే అరుణ ప్రసంగించారు. ప్రపంచంలోనే మోడీ బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారని.. అదే క్రమంలో మన దేశాన్ని అగ్రభాగాన నిలిపారని కొనియాడారు.

జిల్లాలో పుట్టి పెరిగిన తాను.. ఇక్కడి ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేశానని చెప్పుకొచ్చారు. దేశ ప్రజలంతా మోడీ వైపే చూస్తున్న ఈ తరుణంలో.. మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో బీజేపీని గెలిపించాలని కోరారు.
-
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications