వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుణమ్మ ఆగ్రహం..! బీజేపి జోలికొస్తే దంచుడే అని తెలంగాణ మంత్రులకు జేజెమ్మ హెచ్చరిక..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ ఫైర్ బ్రాండ్ డీకే అరుణ కాస్త విరామం తర్వాత మళ్లీ రాజకీయ తెరపైకి వచ్చారు. కరోనా కష్ట కాలంలో ప్రభుత్వ పని తీరు, రైతులు పండించిన ధాన్యం కొనుగోలు, అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపులో ప్రభుత్వ అలసత్వం వంటి అంశాలపై జేజెమ్మ తెలంగాణ ప్రభుత్వం పై విరుచుకు పడింది.

అంతే కాకుండా బీజేపి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీఆర్ఎస్ మంత్రులకు హెచ్చరికలు జారీ చేసారు డీకె అరుణ. సోమవారం ఉదయం బిజెపి ప్రధాన కార్యాలయంలో డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, ధాన్యం సేకరణలో ఇబ్బందులను ఆమె ఎల్ఈడి స్క్రీన్ ద్వారా వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా రైతులంతా బిజెపి నేతలను సంప్రదిస్తూ కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారని అరుణ వివరించారు.

DK Aruna warns telangana ministers for silly comments on bjp leaders.!

అంతే కాకుండా కరోనా వైరస్ వ్యాప్తి, అకాల వర్షాలు, ధాన్యం సేకరణ వంటి అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నందుకు బిజెపి నేతలపై ఎదురు దాడికి దిగితే సహించేది లేదని టీఆర్ఎస్ మంత్రులను ఆమె హెచ్చరించారు. బిజెపి రాజకీయం చేయదలుచుకుంటే టీఆర్ఎస్ మంత్రులు ఒక్కరు కూడా బయట తిరగలేని పరిస్థితులు నెలకొంటాయని అరుణ మండిపడ్డారు.

Recommended Video

Sekhar Kammula Providing Health Drinks To GHMC Workers | Oneindia Telugu

కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నా కూడా టిఆర్ఎస్ నేతలు బిజెపిపై రాజకీయ విమర్శలకు దిగడం సరికాదని అరుణ వ్యాఖ్యానించారు ముందు రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని ఆదుకోవాలని ఆమె హితవు పలికారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని.. రైతుల నుంచి చివరి ధాన్యం గింజ వరకు కొంటామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాట తప్పారని అరుణ ఆరోపించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు లెక్కలను మంత్రులు చెప్పగలరా అని ఆమె సవాల్ విసిరారు.

English summary
TRS ministers have issued warnings against BJP leaders DK Aruna spoke to the media at BJP headquarters on Monday morning. She explained the problems faced by farmers across the state and difficulties in procurement of grain through an LED screen. Arun explained that all the farmers across Telangana are asking the Center to intervene by contacting BJP leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X