12న తుది జాబితా, నోటిఫికేషన్ విడుదల చేస్తాం, వారికే ఓటు హక్కు: హైకోర్టుకు ఈసీ
Recommended Video

హైదరాబాద్: ఓటర్ల జాబితాలో ఫిర్యాదుల పైన హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఎన్నికల సంఘం కౌంటర్ దాఖలు చేసింది. దీంతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఎల్లుండికి (బుధవారం) వాయిదా వేసింది. ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్లో పలు అంశాలను పొందుపర్చింది.
బోగస్ ఓట్లను తొలగించినట్లు కోర్టుకు ఈసీ తెలిపింది. టెక్నాలజీ సహాయంతో 30 లక్షల బోగస్ ఓట్లు ఎత్తివేశామని పేర్కొంది. ఈ నెల 12వ తేదీన తుది జాబితాతో పాటు నోటిఫికేషన్ విడుదల చేస్తామని న్యాయస్థానానికి తెలిపింది.

జాబితాలో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు హక్కు ఉంటుందని ఎన్నికల సంఘం న్యాయస్థానానికి తెలిపింది. ఎన్నికల సంఘం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంతో బుధవారం దీనిపై విచారణ జరగనుంది.
కాగా, తెలంగాణలో ముందస్తు ఎన్నికలు, ఓట్ల అవకతవకలపై గత శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు కాపీ అందిన తర్వాత వాదనలు ప్రారంభమయ్యాయి. నాలుగు పిటిషన్లకు గాను హైకోర్టు రెండు పిటిషన్లను కొట్టి వేసింది. కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన వాదనలు కొనసాగాయి. అనంతరం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఈసీ సోమవారం కౌంటర్ దాఖలు చేసింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications