వార్షికోత్సవం: బోనమెత్తిన ఐటి ఉద్యోగులు
హైదరాబాద్: నగరంలోని ఓ ఐటి కంపెనీ ఉద్యోగులు కంపెనీ వార్షికోత్సవం సందర్భంగా సరదాగా నృత్యాలు చేశారు. ఎప్పుడు కంపెనీ ముందుండే వారు.. ఎంతో ఉత్సాహంగా వార్షికోత్సవంలో పాల్గొన్నారు. అంతేగాక సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా బోనాల పండగను వేదికపై నిర్వహించారు.
షేక్పేట్ జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం డిఎస్టీ ఇండియా ఇన్వెస్ట్ వార్షికోత్సవం తెలంగాణ సంప్రదాయానికి, హైదరాబాద్ అస్తిత్వానికి వేదిక మారింది. వేడుకలో భాగంగా గాయకుడు అంజూ గుర్వారా సంగీత విభావరి అందరినీ అలరించింది.
సాఫ్ట్వేర్ ఉద్యోగులైనప్పటికీ పోతరాజుల వేశం వేసి అద్భుతంగా నృత్యాలు చేశారు. కాగా, మహిళా ఉద్యోగినులు బోనమెత్తారు. అమ్మవారికి భక్తిగా బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.
మరో ఉద్యోగిని మౌనప్రియ భవిష్యవాణి వినిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 14వందల మంది డిఎస్టి ఇండియా సిబ్బంది పాల్గొన్నారు.