ఫేస్బుక్ ఫిర్యాదుతో గుట్టురట్టు: నకిలీ మసాలాల తయారీ ముఠా అరెస్ట్(పిక్చర్స్)
హైదరాబాద్: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీమసాల దినుసుల గుట్టు ఫేస్బుక్ ఫిర్యాదుతో రట్టయింది. నగరంలోని బేగం బజార్లో నకిలీ మసాలా ప్యాకెట్లు విక్రయిస్తున్న ముగ్గురు నిందితులతోపాటు 11మంది వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మాసాలా ప్యాకెట్లలో ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగిస్తున్నారని పోలీసులు తెలిపారు.
సౌత్ జోన్ డిసిపి సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్ర డిజిపికి ఫేస్బుక్లో నకిలీ దినుసుల తయారు చేస్తున్న ఉత్తర్ప్రదేశ్కు చెందిన రాజేశ్ గుప్తా గురించిన సమాచారం వచ్చింది. వెంటనే డిజిపి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డిని అప్రమత్తం చేశారు. కమిషనర్ ఆదేశాలతో దక్షిణ మండలం పోలీసులు రంగంలోకి దిగారు.
పక్కాగా దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున నకిలీ నిత్యావసర మసాలా దినుసుల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు రాజేశ్గుప్తా కోసం నిఘా పెట్టారు. ఉత్తర్ప్రదేశ్ నుంచి అతడి రాకను గమనించిన పోలీసులు దాడులు నిర్వహించారు.
ఉత్తర్ప్రదేశ్కు చెందిన ప్రధాన నిందితుడు రాజేష్ గుప్తా, ముగ్గురు నిందితులతో పాటు బేగంబజార్కు చెందిన 11మంది వ్యాపారులను అరెస్టు చేశారు. 1067 బ్యాగుల నల్ల మిరియాలు, 166 బ్యాగుల బొప్పాయి గింజల బ్యాగులు, 40 బ్యాగుల ముంబయి రవ్వ, 127 బ్యాగుల మైదా, ఐదు బ్యాగుల రాయి ఫౌడర్, ఏషియన్ పెయిం ట్, సోడియం హైడ్రోసల్ఫెట్, ఐరన్ ఆక్సైడ్, గ్లూకోజ్, సింధటిక్ గమ్, ఆర్టిఫిషియల్ ఫ్రూట్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ మసాలాల తయారీ ముఠా అరెస్ట్
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీమసాల దినుసుల గుట్టు ఫేస్బుక్ ఫిర్యాదుతో రట్టయింది.
నకిలీ మసాలాల తయారీ ముఠా అరెస్ట్
నగరంలోని బేగం బజార్లో నకిలీ మసాలా ప్యాకెట్లు విక్రయిస్తున్న ముగ్గురు నిందితులతోపాటు 11మంది వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మాసాలా ప్యాకెట్లలో ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగిస్తున్నారని పోలీసులు తెలిపారు.
నకిలీ మసాలాల తయారీ ముఠా అరెస్ట్
సౌత్ జోన్ డిసిపి సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్ర డిజిపికి ఫేస్బుక్లో నకిలీ దినుసుల తయారు చేస్తున్న ఉత్తర్ప్రదేశ్కు చెందిన రాజేశ్ గుప్తా గురించిన సమాచారం వచ్చింది.
నకిలీ మసాలాల తయారీ ముఠా అరెస్ట్
వెంటనే డిజిపి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డిని అప్రమత్తం చేశారు. కమిషనర్ ఆదేశాలతో దక్షిణ మండలం పోలీసులు రంగంలోకి దిగారు.
నకిలీ మసాలాల తయారీ ముఠా అరెస్ట్
పక్కాగా దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున నకిలీ నిత్యావసర మసాలా దినుసుల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ మసాలాల తయారీ ముఠా అరెస్ట్
ప్రధాన నిందితుడు రాజేశ్గుప్తా కోసం నిఘా పెట్టారు. ఉత్తర్ప్రదేశ్ నుంచి అతడి రాకను గమనించిన పోలీసులు దాడులు నిర్వహించారు.
నకిలీ మసాలాల తయారీ ముఠా అరెస్ట్
ఉత్తర్ప్రదేశ్కు చెందిన ప్రధాన నిందితుడు రాజేష్ గుప్తా, ముగ్గురు నిందితులతో పాటు బేగంబజార్కు చెందిన 11మంది వ్యాపారులను అరెస్టు చేశారు.
నకిలీ మసాలాల తయారీ ముఠా అరెస్ట్
1067 బ్యాగుల నల్ల మిరియాలు, 166 బ్యాగుల బొప్పాయి గింజల బ్యాగులు, 40 బ్యాగుల ముంబయి రవ్వ, 127 బ్యాగుల మైదా, ఐదు బ్యాగుల రాయి ఫౌడర్, ఏషియన్ పెయిం ట్, సోడియం హైడ్రోసల్ఫెట్, ఐరన్ ఆక్సైడ్, గ్లూకోజ్, సింధటిక్ గమ్, ఆర్టిఫిషియల్ ఫ్రూట్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ మసాలాల తయారీ ముఠా అరెస్ట్
హుస్సేనిఆలం చంద్రికాపురంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో మాజీ ఎంపీ అంజన కుమార్ యాదవ్కు చెందిన నాలుగు వేర్వేరు స్థలాలను నెలకు రూ.80 వేలకు అద్దెకు తీసుకుని కల్తీ యూనిట్ని ప్రారంభించాడు.
నకిలీ మసాలాల తయారీ ముఠా అరెస్ట్
హుస్సేని ఆలంలోని ఎంపీ అంజనకుమార్ సోదరుడి ఇంట్లో ఒక ఫోర్షన అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు.
నకిలీ మసాలాల తయారీ ముఠా అరెస్ట్
యూపీ నుంచి 25 మంది యువకులను నగరానికి రప్పించి ఈ కల్తీ దందా చేస్తున్నాడు.
నకిలీ మసాలాల తయారీ ముఠా అరెస్ట్
ఈ నకిలీ దందాతో నిందితులు నెలకు సుమారు రూ. కోటి వరకు సంపాదిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
హుస్సేనిఆలం చంద్రికాపురంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో మాజీ ఎంపీ అంజన కుమార్ యాదవ్కు చెందిన నాలుగు వేర్వేరు స్థలాలను నెలకు రూ.80 వేలకు అద్దెకు తీసుకుని కల్తీ యూనిట్ని ప్రారంభించాడు.
హుస్సేని ఆలంలోని ఎంపీ అంజనకుమార్ సోదరుడి ఇంట్లో ఒక ఫోర్షన అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. యూపీ నుంచి 25 మంది యువకులను నగరానికి రప్పించి ఈ కల్తీ దందా చేస్తున్నాడు. ఈ నకిలీ దందాతో నిందితులు నెలకు సుమారు రూ. కోటి సంపాదిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.