ప్రధానిని ప్రశ్నిస్తూ బ్యానర్లు - పీఎం షెడ్యూల్ లో మార్పు : 17 ప్రాంతాల్లో..!!
ప్రధాని మోదీ కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ లో మార్పు జరిగింది. ఆయన నిర్దేశించిన సమయం కంటే పది నిమిషాలు ముందుగానే బేగంపేట విమానాశ్రయంకు చేరుకుంటారు. అక్కడ దాదాపు 20 నిమిషాలు పార్టీ నేతలకు సమయం కేటాయించారు. అక్కడ నుంచి ఆయన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. ప్రధానికి స్వాగతం పలుకుతూ ఆయన ప్రయాణించే మార్గాల్లో స్వాగత తోరణాలు.. బ్యానర్లు ఏర్పాటు చేసారు.
అయితే, అదే సమయంలో ప్రధాని రాక సందర్భంగా 17 చోట్ల ఆయనకు ప్రశ్నలు సంధిస్తూ బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. ఎవరు ఆ బ్యానర్లు ఏర్పాటు చేసింది అందులో పేర్కొనలేదు. కానీ, తెలంగాణకు హామీ ఇచ్చిన అంశాలనే ప్రశ్నిస్తూ బ్యానర్ల రూపంలో ప్రదర్శించారు. అందులో నిజామాబాద్ పసుపు బోర్డు ఏర్పాటు.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ.. మెడికల్ కాలేజీలు.. హైదరాబాద్ వరద నష్టంకు సాయం ఏదీ ..ఇలా 17 ప్రశ్నలతో ఈ బ్యానర్లు ఏర్పాటు చేసారు. నగరంలోని కీలక ప్రాంతాల్లో ఇవి దర్శనమిచ్చాయి. ఇక, ప్రధాని హైదరాబాద్ కు వస్తున్న సమయంలోనే..ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగుళూరు పర్యటనకు వెళ్లారు,

బేగంపేట నుంచి సీఎం బెంగుళూరు వెళ్లటం..అక్కడికే ప్రధాని లాండ్ కానుండటంతో ఆ ప్రాంతంలో టీఆర్ఎస్ - బీజేపీ శ్రేణుల సందడి కనిపిస్తోంది. గతంలో ప్రధాని హైదరాబాద్ వచ్చిన సమయంలోనూ సీఎం కేసీఆర్ ప్రధానితో కలవలేదు. ఇక, ఇప్పుడు బెంగుళూరు వెళ్తున్న కేసీఆర్..అక్కడ మాజీ ప్రధాని దేవ గౌడతో పాటుగా మాజీ సీఎం కుమార స్వామితోనూ సమావేశం కానున్నారు. రాష్ట్రపతి ఎన్నికలతో పాటుగా జాతీయ రాజకీయాల పైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇక, ప్రధాని సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్ లోనే ఉంటారు. 4.15 గంటలకు హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్తారు. ప్రధానికి బీజేపీ నేతలు స్వాగతం పలకనున్నారు. ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు వీడ్కోలు పలికే బాధ్యతలు అప్పగించారు.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications