స్నేక్గ్యాంగ్కు పదేళ్ల శిక్ష పడొచ్చు: అమ్మాయి కోర్టులో రేప్ జరిగిందని చెప్పనందుకే
హైదరాబాద్: బాధితురాలు తనపై అత్యాచారం జరిగినట్లు కోర్టులో చెప్పకపోవడం వల్లే స్నేక్ గ్యాంగ్ పైన అత్యాచారం అభియోగాలు రుజువు కాలేదని లాయర్ దేవరాజ్ మంగళవారం తెలిపారు. స్నేక్ గ్యాంగ్ నిందితుల్లో ఎనిమిది మందిని దోషులుగా కోర్టు తేల్చిన విషయం తెలిసిందే.
అయితే, వారిపై అత్యాచార అభియోగాలు మాత్రం రుజువు కాలేదు. దీనిపై లాయర్ స్పందించారు. తన పైన సామూహిక అత్యాచారం జరిగిందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెజిస్ట్రేట్ వద్ద వాంగ్మూలం ఇచ్చారన్నారు.

అయితే, సామాజిక కారణాల వల్ల బాధితురాలు అత్యాచారం జరిగినట్లు కోర్టులో చెప్పలేకపోయారని, అందుకే అభియోగాలు వీగిపోయాయని చెప్పారు. తొమ్మిదో నిందితుడిపై.. మిగతా ఎనిమిది మందిని కాపాడే ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. కానీ అతని పైన అభియోగాలు పలు కారణాల వల్ల రుజువు కాలేదన్నారు.
స్నేక్ గ్యాంగ్ నిందితులకు పదేళ్లు అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని చెప్పారు. కాగా, హైదరాబాద్ శివారులో అకృత్యాలకు పాల్పడిన స్నేక్ గ్యాంగ్ కేసుపై కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. శిక్షను మాత్రం బుధవారం ఖరారు చేయనుంది.
-
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!!












Click it and Unblock the Notifications